Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పర్యాటకుల జీపు ముందు పులి: ఏం చేశారు(వీడియో)

నాగ్‌పూర్‌: రెండ్రోజుల క్రితం గుజరాత్ తీరంలో ఓ సింహం భయాందోళనలకు గురిచేయగా.. తాజాగా ఓ పులి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పర్యాటకులకు ముచ్చెమటలు పట్టించింది. వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్‌లోని ఉమ్రెడ్ కర్హాండ్ల అటవీ జంతువుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు ఓపెన్ టాప్ జీపులో బయల్దేరారు పర్యాటకులు.

వారు అటవీ అందాలు వీక్షిస్తుండగా ఒక్కసారిగా ఓ పెద్దపులి వారి జీపు వద్దకు వచ్చింది. దాన్ని చూసిన ఆ పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్పుడు ఆ జీపులో ఇద్దరు పర్యాటకులతోపాటు ఓ పిల్లాడు కూడా ఉన్నారు.

అయితే, జీపులో ఉన్న ముగ్గురిని పెద్దగా పట్టించుకోకుండా పులి మాత్రం వాహనం ముందు అద్దంతో కాసేపు ఆడుకుంది. ఈ కాసేపు ఆ ముగ్గురు ప్రాణాలను అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉలుకు-పలుకు లేకుండా అలికిడి చేయకుండా బొమ్మల్లా ఉండిపోయారు.

కాగా, వారికి ఎలాంటి హాని చేయకుండానే పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తోంది.

ఇది ఇలా ఉండగా, రెండ్రోజుల క్రితం గుజరాత్ అమ్రెల్లి జిల్లాలోని జఫ్రాబాద్ వద్ద ఓ సింహం సముద్రంలోకి దూకి ఈతకొడుతుండగా.. అటవీ అధికారులు పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+