కేజ్రీవాల్ ఎఫెక్ట్: ఢిల్లీలో నోటాకు నో, ప్రముఖుల స్థానాల్లో..

ప్రముఖుల విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిష, బుధ్నీ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. విదిషలో 1,368 ఓట్లతో నోటా మూడో స్థానంలో, బుధ్నీలో 2,247 ఓట్లతో నాలుగో స్థానంలో ఉంది.
దిగ్విజయ్ సింగ్ తనయుడు జైవర్ధన్ సింగ్ రాఘోగఢ్ నుండి బరిలో దిగారు. ఇక్కడ నోటాకు 2,587 మంది ఓటేశారు. ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రాతినిథ్యం వహించిన రాజ్నాథ్ గాంవ్లో నోటాకు 2,042, మహేంద్ర కర్మ భార్య దేవతి కర్మ పోటీ చేసిన దంతేవాడలో 9,677లో నోటాకు వచ్చాయి.
రాజస్థాన్లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి వసుందరా రాజే నియోజకవర్గంలో నోటా 3,729 ఓట్లతో మూడో స్థానంలో, కాంగ్రెసు నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నియోజకవర్గం సర్దార్పురాలో 1,779 ఓట్లు నోటాకు పోలయ్యాయి.












Click it and Unblock the Notifications