మహిళా జడ్జిపై అత్యాచారం, ఆపై హత్యాయత్నం
ఆమె స్పృహ తప్పి తన అధికారిక నివాసంలో పడి ఉన్నారు. ఆమెకు విపరీతంగా డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారం చేసినట్లు సమాచారం. ఆమె శరీరంపై ఎక్కడపడితే అక్కడ గాయాలున్నాయి. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీనియర్ ఎస్పీ నితిన్ తివారీ చెప్పారు.
బాధితురాలు ఇంకా స్పృహలోకి రాలేదని, దాంతో వైద్య పరీక్షలు ఏమీ చేయలేదని, ఆమెకు స్పృహ వచ్చి విచారించే స్థితికి వచ్చిన తర్వాత వైద్య పరీక్షలు చేయిస్తామని ఆయన చెప్పారు. సగం ఖాళీ అయిన పురుగుల మందు సీసా కూడా సంఘటనా స్థలంలో ఉంది.
భయంతో దుండగులు ఆమెకు బలవంతంగా పురుగుల మందు తాగించి ఉంటారని అనుమానిస్తున్నారు. దాడి చేసినవారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాదౌన్ జిల్లాలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసి, వారిని చంపిన సంఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసిన నేపథ్యంలో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకోవడం కలవరానికి గురి చేస్తోంది.