ఎన్టీపీసీ పేలుడు: గుజరాత్ యాత్ర మధ్యలో రాయ్బరేలీకి రాహుల్ గాంధీ
అహ్మదాబాద్/రాయ్బరేలీ: యూపీలోని రాయ్బరేలి ఎన్టీపీసీలో పేలుడు కారణంగా 18 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
Recommended Video

Gujarat Assembly elections on December 9 and 14 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ | Oneindia Telugu
ఈ నేపథ్యంలో దక్షిణ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

పేలుడు విషయం తెలియగానే రాహుల్ గాంధీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తన సంతాపం తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ కుటుంబం సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ట్వీట్ కూడా చేశారు. ఎన్టీపీసీ ప్రమాదం కారణంగా తాను గురువారం ఉదయం రాయ్బరేలీని సందర్శిస్తానని, అనంతరం మధ్యాహ్నం తిరిగి గుజరాత్లో యాత్రలో పాల్గొంటానని ట్విట్టర్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications