Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీహార్ సీఎం కుర్చీ కోసం.. ఉజ్జయిని స్మశానంలో 'గుడ్లగూబల' బలి!

Bihar Election 2025: ఓ వైపు బీహార్ ఎన్నికల రణక్షేత్రంలో కొందరు అభ్యర్థులు ప్రజా మద్దతు కోసం పోరాడుతుంటే.. మరికొందరు తమ విజయాన్ని ఖరారు చేసుకోవడానికి అసాధారణ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కాలభైరవుడు కొలువైన ఉజ్జయినిలోని పవిత్ర స్మశాన వాటికలు ఇప్పుడు బీహార్ ఎన్నికల అభ్యర్థుల విజయ సాధనకు కేంద్రంగా మారాయి. సాధారణంగానే తంత్ర-మంత్ర సాధనలకు అత్యంత శక్తివంతమైనదిగా భావించే కార్తీక అమావాస్య(దీపావళి) సందర్భంగా ఉజ్జయినిలోని విక్రాంత్ భైరవ్ స్మశానం బీహార్ ఎన్నికల విజయం కోసం అభ్యర్థులు చేయిస్తున్న రహస్య పూజలతో వార్తల్లో నిలిచింది.

ధనత్రయోదశి నుంచి దీపావళి వరకు అనుష్ఠానం
తంత్ర సాధకుడు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రత్యేక అనుష్ఠానం ధనత్రయోదశి రోజునే ప్రారంభమైంది. సిద్ధులు, అద్భుత శక్తులు, కోరిన కోరికలు నెరవేరడం కోసం చేసే ఈ పూజలు దీపావళి అమావాస్య రాత్రి అత్యున్నత దశకు చేరుకుంటాయి. ఈ అనుష్ఠానంలో ప్రధానంగా రాజకీయ విజయం, అధికార ప్రాప్తి కోసం తంత్ర క్రియలు నిర్వహిస్తున్నారు. కొందరు బీహార్ ఎన్నికల అభ్యర్థులు తమ విజయానికి ఎటువంటి లోటు రాకుండా ఉండేందుకు ఈ శక్తివంతమైన క్షేత్రాన్ని ఆశ్రయించారు.

Occult Rituals in Ujjain Crematorium for Bihar Elections Owl Sacrifice Sparks Buzz

వంద శాతం విజయం ఇచ్చే క్షేత్రం
తంత్ర సాధకులు విక్రాంత్ భైరవ్ స్మశానాన్ని భైరవస్వామి స్వయంగా తపస్సు చేసిన 'భైరవ్‌గఢ్'గా అభివర్ణిస్తారు. అందుకే ఇక్కడ చేసిన సాధనలు ఎట్టి పరిస్థితుల్లోనూ వంద శాతం విజయాన్ని తెచ్చిపెడతాయని, ప్రత్యర్థులను అణిచివేసి విజయశంఖాన్ని పూరించే శక్తిని ఇస్తాయని వారి నమ్మకం. ఈ స్మశానం భైరవ బాబా, కాళీ మాత, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు అనువైన స్థలంగా భావిస్తారు.

ఆకర్షణకు కారణాలు: తంత్ర క్రియలు, అసాధారణ పూజలు
ఉజ్జయిని స్మశానం, కామాఖ్య, తారాపీఠ్ వంటి దేశంలోని ఐదు అత్యంత శక్తిమంతమైన శ్మశాన వాటికల్లో ఒకటి. దీపావళి అమావాస్య రాత్రి యశస్సు, వైభవం, అపార ధనధాన్యం, ఆధిపత్యం కోసం ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. అభ్యర్థులు తమ అదృష్టాన్ని, అధికారాన్ని పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని అసాధారణ సాధనలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

గుడ్లగూబ బలి: ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి గుడ్లగూబ వాహనంపై స్వారీ చేస్తుంది. ధనాన్ని, రాజకీయ ఆధిపత్యాన్ని పొందడానికి కొందరు తాంత్రికులు ప్రత్యేకంగా గుడ్లగూబను బలిచ్చి కఠోర సాధన చేస్తారు. దీర్ఘాయుష్షు,స్థిరమైన విజయాన్ని కోరుతూ తాబేలు సాధన (కూర్మ సాధన) కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ధనాన్ని ఆకర్షించడం కోసం కోడి సాధన, రత్తి సాధన వంటి క్లిష్టమైన క్రియలను కూడా చేపడుతున్నారు.ఎలాంటి ఆటంకాలు లేకుండా తమకు విజయం దక్కాలని కోరుకుంటూ గౌరీ-గణేశ సాధన కూడా చేస్తున్నారు.

ఓవైపు నగరం మొత్తం దీపాల వెలుగులతో సంబరాలు జరుపుకుంటుంటే, మరోవైపు ఈ సాధకులు చీకట్లో మునిగి, మంత్ర-తంత్రాల ద్వారా శక్తి, అధికారం, సంపదలను తమ వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. బీహార్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రజల ఓట్లు ఎంత పనిచేస్తాయో, ఈ రహస్య పూజలు కూడా అంత ముఖ్యమైనవని నమ్మే అభ్యర్థులు ఈ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+