వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం ఆదేశాలతో స్పీకర్ సహా ఒడిశా మంత్రులంతా రాజీనామా: రేపే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర మంత్రులందరూ రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో ఒడిశా కేబినెట్‌లోని మంత్రులందరూ రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్ కూడా రాజీనామా చేశారు. కాగా, కొత్త మంత్రివర్గం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణస్వీకారం చేయనుంది.

స్పీకర్​ సూర్యనారాయణ పాత్రో తన స్పీకర్​ పదవికి రాజీనామా చేశారు. దీంతో అయనను కొత్త మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి మంత్రివర్గాన్ని మార్చాలనే నిర్ణయం సీఎం నవీన్ పట్నాయక్ ఎందుకు తీసుకున్నారో ఎలాంటి సమాచారం లేదు. కొత్త వారికి చోటు కల్పించేందుకే ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.

 Odisha Cabinet reshuffle: Naveen Patnaik orders for All ministers and assembly speaker to resign

ఒడిశాలోని అధికార బీజేడీ శుక్రవారం బ్రజరాజ్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని నమోదు చేసింది. అక్కడ అభ్యర్థి అలకా మొహంతి 66,122 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 తర్వాత మొదటిసారిగా ప్రతిపక్ష బీజేపీని మూడవ స్థానానికి నెట్టివేసింది.

2024 సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికలో, మొహంతి 93,953 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అనుభవజ్ఞుడు కిషోర్ పటేల్‌ను 27,831 ఓట్లతో ఓడించారు.బీజేపీ అభ్యర్థి, బ్రజరాజ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే రాధారాణి పాండా 22,630 ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఆమె భర్త బ్రజరాజ్‌నగర్ ఎమ్మెల్యే కిషోర్ మొహంతి అకాల మరణంతో వచ్చి సానుభూతి, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజాదరణ కారణంగా మొహంతి సీటును భారీ మెజార్టీతో గెలుచుకున్నారు.

English summary
Odisha Cabinet reshuffle: Naveen Patnaik orders for All ministers and assembly speaker to resign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X