ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై దుండగుల కాల్పులు .. పరిస్థితి విషమం
ఒకపక్క ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతుంటే మరోపక్క హింస కూడా చెలరేగుతుంది. ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై ఆగంతకులు దాడికి పాల్పడ్డారు .గంజాం జిల్లా అసిక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మనోజ్ జెనా పై దుండగులు జరిపిన దాడిలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు.
ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మనోజ్ జెనాపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. భువనేశ్వర్ నుంచి అసిక వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. బ్రహ్మపుర బైపాస్ రోడ్ లో మనోజ్ వెళ్తుండగా వెంబడించిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయన తన వాహనం దిగిన వెంటనే ఆయనపై కాల్పులు జరిపారు .ఆరుగురు దుండగులు ఆయనను చుట్టుముట్టి కాల్పులు జరిపారు . అనంతరం, మనోజ్ పై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం మనోజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.