ఓం బిర్లా కుమార్తెపై సంచలన ఆరోపణలు.. బ్యాక్ డోర్లో సివిల్స్కి ఎంపిక..? అసలు వాస్తవం ఇదీ...
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా బ్యాక్ డోర్ ద్వారా సివిల్స్కు ఎంపికైందని ఆరోపిస్తూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్గా మారాయి. అసలు యూపీఎస్సీ పరీక్ష కూడా రాయకుండానే ఆమె సివిల్స్కి ఎంపికైందని ఆ పోస్టుల్లో ఆరోపించారు. కేవలం తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని ఆమె అడ్డదారిలో ఐఏఎస్ సాధించారని ఆరోపించారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ సంస్థ తేల్చింది.

బ్యాక్ డోర్ ఎంట్రీలో 90 సీట్లు?
అంజలి బిర్లాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ సంస్థ ఒక పోస్టును షేర్ చేసింది. 'ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించారు. నిజానికి ఆమె అసలు పరీక్ష కూడా రాయలేదు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే యూపీఎస్సీలో 90 సీట్లను బ్యాక్ డోర్ ఎంట్రీ కోసం రిజర్వ్ చేశారు.కేవలం రాజకీయ పలుకుబడి కారణంగా కష్టపడి చదివే అభ్యర్థులకు బదులు ఇలాంటివాళ్లకు సివిల్స్లో స్థానం దక్కుతోంది.'అని ఆ పోస్టులో ఆరోపించారు.
Recommended Video

అంజలి బిర్లా సివిల్స్ పరీక్ష రాశారా?
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఫ్యాక్ట్ చెక్ తేల్చింది. అంజలి బిర్లా 2019లో యూపీఎస్సీ ప్రిలిమ్స్తో పాటు,మెయిన్స్ కూడా రాసి అర్హత సాధించిందని పేర్కొంది. దీనికి సంబంధించి యూపీఎస్సీ ప్రచురించిన ర్యాంకుల జాబితాను కూడా షేర్ చేసింది. ఆమె హాల్ టికెట్ నం.0851876 అందులో స్పష్టంగా కనిపిస్తోంది. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అంజలి బిర్లా కూడా ఖండించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొన్నారు. పుకార్లు ఎప్పుడూ వినేందుకు బాగుంటాయని... కానీ ఇలాంటి అర్థం లేని,ఆధారాలు లేని విమర్శలను తానెప్పుడూ చూడలేదని అన్నారు.

సివిల్స్... ఎంతోమంది కల...
దేశంలో అత్యున్నత సర్వీసుల్లో చేరేందుకు యూపీఎస్సీ ఒక ప్రవేశ ద్వారం లాంటిది.ప్రతీ ఏటా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది అభ్యర్థులు యూపీఎస్సీకి పోటీపడుతారన్న సంగతి తెలిసిందే. వీరిలో కేవలం కొన్ని వందల మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. ప్రిలిమ్స్,మెయిన్స్,ఇంటర్వ్యూ... ఇలా మూడంచెల ప్రక్రియ ద్వారా యూపీఎస్సీకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. చిన్న వయసులోనే అధికార హోదా,సమాజం కోసం పనిచేసే అవకాశం ఉండటంతో చాలామంది విద్యావంతులు సివిల్స్ను తమ మొదటి లక్ష్యంగా పెట్టుకుంటారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications