ఎవ్వరి ఆచారాన్ని కించపరిచినట్లు కాదు, సుప్రీం

న్యూఢిల్లీ: పరిక్ష వ్రాసే రోజు బురఖా వేసుకోకుంటే మీ ధర్మానికి, ఆచారాన్ని కించపరిచినట్లు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పరిక్షా కేంద్రాలకు బురఖా వేసుకుని వెళ్లి పరిక్ష వ్రాయడానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థి సంఘం సమర్పించిన అర్జీని సుప్రీం కోర్టు కొట్టి వేసింది.

ఆల్ ఇండియా ఫ్రీ మెడికల్, డెంటల్ టెస్ట్ (ఏఐపీఎంటీ) పరిక్షలు శనివారం మళ్లి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ పరిక్షలకు హాజరు అయ్యే అమ్మాయిలు బురఖాలు వేసుకుని రావచ్చని కేరళ హై కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

On a day when you have to sit for exam, you are being asked not to wear it.

పరిక్ష కేంద్రాలను పర్యవేక్షించే అధికారులకు అనుమానం వస్తే బురఖాలు తీసి పరిశీలించాలని కేరళ హై కోర్టు సూచించింది. అయితే ఈ కేసు వివాదం సుప్రీం కోర్టులోకి వెళ్లింది. బురఖాలు వేసుకుని పరిక్షలు వ్రాయడానికి అనుమతి ఇవ్వాలని ఇస్లామిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఒ) సుప్రీంలో అర్జీ సమర్పించింది.

శుక్రవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని ధర్మాసనం అర్జీ విచారణకు స్వీకరించారు. పరిక్షా కేంద్రాలకు ఒక్క రోజు బురఖా వేసుకుని వెల్లకపోతే మీ మతాన్ని, ధర్మాన్ని, ఆచారాన్ని కించపరిచినట్లు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+