వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ పై మళ్లీ నోరు పారేసుకున్న పాక్ హై కమిషనర్

భారత్ లో పాకిస్తాన్ హై కమిషనర్ గా ఉన్న అబ్దుల్ బాసిత్ కశ్మీర్ పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ లో పాకిస్తాన్ హై కమిషనర్ గా ఉన్న అబ్దుల్ బాసిత్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన 'పాకిస్తాన్ డే' కార్యక్రమంలో మరోసారి కశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కశ్మీర్ వేర్పాటు వాదులకు మద్దతు పలికారు. వారు చేస్తున్న పోరాటం స్వాతంత్ర్యం కోసమేనంటూ వారిని గట్టిగా వెనకేసుకొచ్చారు. దేవుడి దయవల్ల వారి పోరాటం త్వరలోనే నెరవేరుతుందని వ్యాఖ్యానించారు.

On Pakistan day: Envoy Abdul Basit raises Kashmir issue again

కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందన్నారు. అయితే కశ్మీరీల ఆకాంక్షలను ప్రతిబింబించేలా జమ్ముకశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిందేనన్నారు.

భారత్ మండిపాటు

పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. భరతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ భారత విదేశాంగ శాఖ ఆయనకు హితవు పలికింది. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యానాలు చేయడం కన్నా పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదాన్ని రూపుమాపే విషయంపై దృష్టి సారించడం మంచిదని పేర్కొంది.

English summary
NEW DELHI: Pakistan High Commissioner to India Abdul Basit, on Thursday, once again raised Kashmir issue while expressing Islamabad's desire to have good relations with India. He also extended support for the Kashmiri separatists, saying their struggle is for the freedom."We hope that we will be able to solve our differences and issues especially the Kashmir issue," the Pakistan envoy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X