కశ్మీర్ పై మళ్లీ నోరు పారేసుకున్న పాక్ హై కమిషనర్
భారత్ లో పాకిస్తాన్ హై కమిషనర్ గా ఉన్న అబ్దుల్ బాసిత్ కశ్మీర్ పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: భారత్ లో పాకిస్తాన్ హై కమిషనర్ గా ఉన్న అబ్దుల్ బాసిత్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన 'పాకిస్తాన్ డే' కార్యక్రమంలో మరోసారి కశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్ వేర్పాటు వాదులకు మద్దతు పలికారు. వారు చేస్తున్న పోరాటం స్వాతంత్ర్యం కోసమేనంటూ వారిని గట్టిగా వెనకేసుకొచ్చారు. దేవుడి దయవల్ల వారి పోరాటం త్వరలోనే నెరవేరుతుందని వ్యాఖ్యానించారు.

కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందన్నారు. అయితే కశ్మీరీల ఆకాంక్షలను ప్రతిబింబించేలా జమ్ముకశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిందేనన్నారు.
భారత్ మండిపాటు
పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. భరతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ భారత విదేశాంగ శాఖ ఆయనకు హితవు పలికింది. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యానాలు చేయడం కన్నా పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదాన్ని రూపుమాపే విషయంపై దృష్టి సారించడం మంచిదని పేర్కొంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications