Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

22 ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు..! అందులో జైషే మహ్మద్ సంస్థలెన్నో తెలుసా?

ఢిల్లీ : ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ లో ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు ఎన్నో తెలుసా? వాటిలో జైషే మహ్మద్ సంస్థ షేర్ ఎంతో తెలుసా? ఇలాంటి ప్రశ్నలకు భారత్ కు చెందిన సీనియర్ అధికారి చెప్పిన వివరాలు విస్మయం కలిగిస్తున్నాయి. పాకిస్థాన్ లో టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్లు 22 ఉన్నాయట. అందులో జైషే మహ్మద్ సంస్థకు చెందినవి 9 ఉన్నట్లు ఆ అధికారి వెల్లడించారు. ఆ సంస్థలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.

one senior indian officer said that 22 terrorists training centres in pakistan, jaishe mohammed having 9

ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే గాకుండా ఉద్రిక్తత మరింత పెంచే దిశగా పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పేరు చెప్పడానికి నిరాకరించిన సదరు అధికారి.. పాకిస్థాన్ నీతిమాలిన చర్యలకు పాల్పడుతోందని ఫైరయ్యారు. ఇటీవల పలు టెర్రరిస్టు సంస్థలకు చెందిన నేతలను పాకిస్థాన్ గృహనిర్భందం చేయడం లాంటి చర్యలను డ్రామాగా కొట్టిపారేశారు. భారత్ లో ఉగ్రదాడుల అనంతరం ప్రతిసారి ఇలాగే చేస్తుందంటూ ధ్వజమెత్తారు. గృహనిర్భందం పేరుతో వారికి సకల సదుపాయాలు అందిస్తుందని చెప్పుకొచ్చారు. పరిస్థితి చక్కబడిన తర్వాత మళ్లీ వారిని స్వేచ్ఛాజీవులుగా విడిచిపెడుతుందని వివరించారు. సరిహద్దుల్లో ఇప్పటికీ పాక్ ఉగ్రవాదులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని.. అవి శ్రుతిమించితే బాలకోట్ వైమానిక దాడుల లాంటివి భారత్ మరిన్ని రుచి చూపిస్తుందని హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+