తాజ్మహల్ సందర్శన: రోజూ 40 వేల మంది ఇండియన్లకు అనుమతి
న్యూఢిల్లీ: తాజ్మహల్ను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్యపై ప్రభుత్వం పరిమితిని విదించింది. ప్రతి రోజూ 40 వేల మంది భారతీయ పర్యాటకులు మాత్రమే తాజ్మహల్ను సందర్శించేలా నిబంధనలు విధించారు.
విదేశీ పర్యాటకులపై ఎలాంటి ఆంక్షలను మాత్రం విధించలేదు ఈ నెల 20వ , తేది నుండి ఈ నిర్ణయాన్ని అమల్లోకి రానుంది కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకొంది.

తాజ్ మహల్ పరిరక్షణపై పారా మిలటరీ, ఏఎస్ఐ, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర పర్యాటక శాఖ చర్చలు జరిపింది. ఈ సమావేశం తర్వాత కేంద్ర పర్యాటక శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకొంది. తాజ్ను వీక్షించే టూరిస్టుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోతోంది. దీంతో ఈ ప్రపంచ వారసత్వ కట్టడాన్ని సంరక్షించేందుకు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, ఇతర రక్షణ చర్యలు తీసుకునేందుకు ఇబ్బందులు ఎదరవుతున్నట్లు అధికారులు తెలిపారు.
మరో వైపు తాజ్మహల్ లోపలికి వెళ్ళేందుకు 15 ఏళ్ళ లోపు చిన్నారులకు ప్రవేశం ఉచితం. అయితే 15 ఏళ్ళు దాటిన వారికీ మాత్రం టిక్కెట్టు చెల్లించాల్సిందే. ప్రతి రోజూ 40 వేల మంది ఇండియన్ టూరిస్టులకు టిక్కెట్లు జారీ చేస్తారు.
విదేశీ టూరిస్టులకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. ముంతాజ్ సమాధిని సందర్శించేందుకు రూ.100 చెల్లించి టిక్కెట్టును కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications