ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం: కేంద్ర మంత్రి సంచలనం!
దేశ రాజధాని ఢిల్లీని సోమవారం సాయంత్రం ఓ భారీ పేలుడు ఘటన కుదిపేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడు కారణంగా దాదాపు 9 మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు.ఈ భారీ పేలుడు కేసు విచారణ కొనసాగుతోంది. భద్రతా సంస్థలు ఈ దాడికి సంబంధించిన ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) అధ్యక్షుడు జీతన్రామ్ మాంఝీ ఈ ఘటనపై కీలక ప్రకటన చేశారు. ఈ ఘటన తర్వాత బీహార్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. బీహార్లో రెండో దశ పోలింగ్ జరుగుతున్న సమయంలోనే మాంఝీ ఈ పేలుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఉగ్రవాదుల దృష్టి చాలా కాలం నుంచే ఢిల్లీపై ఉందని.. ఈ తరహా కుట్ర జరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదని జీతన్రామ్ మాంఝీ అన్నారు. ఉగ్రవాదులు 'ఆపరేషన్ సింధూర్'కు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు.ఉగ్రవాదులు చాలా కాలంగా ఢిల్లీపైనే దృష్టి సారించినట్లు ఆయన స్పష్టం చేశారు.

బీహార్ ప్రజలకు జీతన్రామ్ మాంఝీ విజ్ఞప్తి
బీహార్ ఎన్నికల నేపథ్యంలో జీతన్రామ్ మాంఝీ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. "మొదటి దశలో ప్రజలు ఏ ఉత్సాహంతో ఓటు వేశారో, అదే ఉత్సాహం, ఐక్యతతో రెండో దశలో కూడా ఓటు వేయాలి. తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి పరంపర కొనసాగుతుంది" అని ఆయన కోరారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేస్తున్న పనిని మాంఝీ కొనియాడారు. "అభివృద్ధి రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, పేదల సంక్షేమ పథకాలు వంటి ప్రతి రంగంలోనూ మంచి పని జరుగుతోంది. అందుకే ఈ పురోగతిని కొనసాగించడానికి ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలి" అని ఆయన విజ్ఞప్తి చేశారు.
జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక
బీహార్ ప్రజలను హెచ్చరిస్తూ.. ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి జరగుతున్న ఎన్నికలు అని జీతన్రామ్ మాంఝీ అన్నారు. "మనం గనుక పొరపాటు చేస్తే, బీహార్ అభివృద్ధి ప్రయాణం పట్టాలు తప్పుతుంది. పనులు అసంపూర్తిగా ఉండిపోతాయి. మళ్లీ మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే చేరుకుంటాం" అని ఆయన ప్రజలను హెచ్చరించారు. గత కొన్నేళ్లుగా బీహార్ సాధించిన వేగవంతమైన పురోగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
ఇతరులు ఏమీ చేయలేరు: తేజస్వీపై విమర్శలు
ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకుంటూ మాంఝీ విమర్శలు గుప్పించారు. "ఇతరులు బీహార్ కోసం ఏమీ చేయరు. అభివృద్ధి పనులన్నీ ఎన్డీయే ప్రభుత్వంలోనే జరిగాయి. ఇప్పుడు పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నవారు తమ పాలనలో ఏం చేశారో ముందు చెప్పాలి," అని ఆయన ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కారణంగానే ఈ రోజు గ్రామగ్రామాన విద్యుత్, రోడ్లు, పేదలకు నేరుగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని మాంఝీ నొక్కి చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications