Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్థాన్ ను మరింత నష్ట పరిచేందుకు రెడీ: BSF

ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. వందలాది మంది ఉగ్రమూకలను ధ్వంసం చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ సరిహద్దు గుండా ఉన్న దాదాపు 60కు పైగా టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్స్ పాకిస్థాన్ అంతర్గత భూభాగంలోకి షిఫ్ట్ అయినట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) స్పష్టం చేసింది. మరో 12 లాంచ్ ప్యాడ్స్ సియాల్ కోట్, జఫ్ఫార్ వాల్ ప్రాంతం నుంచి పనిచేస్తున్నట్లు పేర్కొంది. అవి సరిహద్దుకు కొంచెం దూరంలోనే ఉన్నట్లు BSF డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ విక్రమ్ కుమార్ తెలిపారు.

పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ధాటికి పాకిస్థాన్ తోక ముడిచినట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) స్పష్టం చేసింది. పాకిస్థాన్ బోర్డర్ వద్ద నుంచి దాదాపు 60 టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్స్ పాకిస్థాన్ లోని అంతర్గత ప్రాంతాలకు షిఫ్ట్ అయినట్లు BSF తెలిపింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో బోర్డర్ లో ఉన్న అనేక టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ను ధ్వంసం చేసినట్లు BSF డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ విక్రమ్ కుమార్ తెలిపారు. BSF ధాటికి పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఫెసిలిటీస్ ను డెప్త్ ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. మరో 12 లాంచ్ ప్యాడ్స్ సియాల్ కోట్ అండ్ జఫ్పార్ వాల్ లోని లోతైన ప్రాంతాల నుంచి వర్కింగ్ లో ఉన్నట్లు విక్రమ్ కుమార్ వివరించారు. టెర్రరిస్టు ప్రాంతాలు, లాంచ్ ప్యాడ్స్ ఇలా ఎప్పటికప్పుడు మారుస్తున్నట్లు గుర్తించినట్లు స్పష్టం చేశారు.

BSF ఇన్ స్పెక్టర్ జనరల్, జమ్ము ఫ్రంటియార్, శశాంక్ ఆనంద్, డీఐజీ కుల్వంత్ రాయ్ శర్మ తో కలిసి ఏర్పాటు చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ లో BSF డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ విక్రమ్ కుమార్ ఈ కీలక విషయాలు వెల్లడించారు. అయితే మరోసారి క్రాస్- బోర్డర్ ఆపరేషన్ కు సిద్ధమేనని తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే శత్రు దేశానికి మరింత నష్టం చేకూరుస్తామని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లో జరిగిన నష్టం కంటే పాకిస్థాన్ కు మరింత నష్టం కలిగించే సామర్థ్యం BSF కు ఉందని ఇన్ స్పెక్టర్ జనరల్ విక్రమ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పాలసీ తీసుకున్నా దాన్ని అమలు పరిచేందుకు BSF సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Operation Sindhur Success Terror Launch Pads Pushed Deep Inside Pakistan BSF

ఇక జమ్మూకాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాల్లోని పహల్గామ్ వ్యాలీలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే 7-10 వరకు జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 9 కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రమూకలను ఏరిపారేసింది భారత సైన్యం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+