శశికళకు అక్కడే చెక్: ఢిల్లీకి వెలుతున్న పళనిసామి, పన్నీర్ సెల్వం, అఫిడవిట్లతో వెనక్కి !
అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను శాశ్వతంగా తప్పించడానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాస్టర్ ప్లాన్ వేశారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను శాశ్వతంగా తప్పించడానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాస్టర్ ప్లాన్ వేశారు. ముల్లును ముల్లుతోనే తియ్యాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.
పళనిసామి, పన్నీర్ కు షాక్: 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మా; హ్యాడ్ ఇచ్చారా ? లేదంటే జంప్ ?
శశికళను అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించామని దృవీకరిస్తూ గతంలో అన్నాడీఎంకే పార్టీ నేతలు భారత ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు సమర్పించారు. శశికళను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఇచ్చిన అఫిడవిట్లను వెనక్కి తీసుకోవాలని సోమవారం నిర్ణయించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం స్వయంగా ఢిల్లీ చేరుకుని భారత ఎన్నికల కమిషన్ కార్యాలయంలో శశికళకు మద్దతుగా ఇచ్చిన అఫిడవిట్లు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. దినకరన్ దూకుడుకు ఈ విధంగా కట్టడి చెయ్యాలని ఇరువురు నేతలు సిద్దం అయ్యారు.
తమిళనాడు సీఎం పళనిసామి పదవికి ఎసరు: పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్ !
ముల్లును ముల్లుతోనే తీద్దాం అంటూ పన్నీర్ సెల్వం సోమవారం పార్టీ నాయకులను ఉద్దేశిస్తూ శశికళ విషయంలో స్పంధించారు. భారత ఎన్నికల కమిషన్ కార్యాలయంలో అధికారికంగా ఇచ్చిన అఫిడవిట్లను పళనిసామి, పన్నీర్ సెల్వం వెనక్కి తీసుకుంటే అన్నాడీఎంకే పార్టీ రాజకీయాలకు శశికళ శాశ్వతంగా దూరం కావాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.