గోవా, మణిపూర్లలో ఉత్కంఠ: కీలకమైన స్థానిక పార్టీలు, ఇతరులు!
ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. కాగా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఏదో ఒక పార్టీకి స్పస్టమైన మెజార్టీ రాగా, గోవా, మణిపూర్లలో మాత్రం హంగ్ ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పోటా పోటీ అన్నట్లు ఫలితాలు విడుదలవుతున్నాయి.
గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 12, కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మహారాష్ట్ర గోమాంతక్ పార్టీ(ఎంజీపీ) 2, గోవా ఫార్వర్డ్ పార్టీ 3, ఎన్సీపీ 3, స్వాతంత్రులు 3 స్థానాల్లో ఆధిక్యం చాటుకున్నారు. దీంతో 40స్థానాలున్న గోవాలో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గోవాలో ఇతరుల మద్దతే కీలకంగా మారుతోంది.

ఇది ఇలా ఉంటే.. మణిపూర్లో కూడా ఇతరులే కీలకంగా మారారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 25, బీజేపీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా, ఇతరులు 9స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 60స్థానాలున్న మణిపూర్లో కూడా మేజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాకపోవడంతో ఇతరులే కీలకంగా మారారు.
ఈ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అయిన అధికారం చేపట్టాలంటే ఇతరుల మద్దతు తీసుకోక తప్పదు. అయితే, ఇతరులు ఏ పార్టీకి మొగ్గుచూపుతారనేది ఉత్కంఠగా మారింది. కాగా, గోవాలో ఇతరు తమ పార్టీ అభ్యర్థులేనని కాంగ్రెస్ ప్రకటించుకోవడం గమనార్హం.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..?












Click it and Unblock the Notifications