యాంటీ బయాటిక్స్ అతిగా వాడుతున్నారా? ఐసీఎంఆర్ హెచ్చరిక తెలిస్తే మీరు ఆ పని చెయ్యరు!!
మనదేశంలో యాంటీ బయోటిక్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా యాంటీబయాటిక్స్ ను ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది. ఇబ్బడిముబ్బడిగా యాంటీబయాటిక్స్ ను వినియోగించడం వల్ల అవి ప్రభావవంతంగా పని చేయడం లేదని ఐసీఎంఆర్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యాంటిబయాటిక్స్ వినియోగానికి వ్యతిరేకంగా వైద్యులకు హెచ్చరిక జారీ చేసింది.
యధేచ్ఛగా యాంటీబయాటిక్స్ వినియోగించడం వల్ల మానవ శరీరంలో ఉండే వ్యాధికారక క్రిములలో వాటిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని ఐసీఎమ్ఆర్ వెల్లడించింది. దీంతో సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడం సవాల్ గా మారుతోంది అని హెచ్చరించింది. రోగులకు యాంటీబయాటిక్స్ ను సూచించేటప్పుడు వైద్యులు కచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ముందు ఇన్ఫెక్షన్ ను గుర్తించడం కోసం క్లినికల్ డయాగ్నసిస్ చేపట్టాలని ఒకవేళ అవసరమైతేనే యాంటీబయాటిక్స్ ఇవ్వాలని పేర్కొంది. క్లినికల్ డయాగ్నసిస్ ద్వారా సరైన యాంటీబయాటిక్స్ ను గుర్తించడానికి అవకాశం ఉంటుందని ఐసీఎంఆర్ తెలిపింది.

దేశంలో యాంటీ బయోటిక్స్ వాడకం పై 2021 జనవరి 1 నుండి డిసెంబరు 31 వరకు నిర్వహించిన సర్వే ఫలితాలను వెల్లడిస్తూ ఐసిఎంఆర్ తాజా హెచ్చరిక చేసింది. 100.4 డిగ్రీల జ్వరం నుండి 102.2 డిగ్రీల వరకు జ్వరం ఉంటే యాంటీబయాటిక్స్ వినియోగం ఏమాత్రం మంచిది కాదని ఐసీఎమ్ఆర్ హెచ్చరించింది. అలాగే వైరల్ బ్రాంకైటిస్ కు కూడా వినియోగించే యాంటీబయాటిక్స్ విషయంలో జాగ్రత్త వహించాలని వైద్యులకు సూచించింది. అలసటగా ఉండటం, దగ్గు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, కొద్దిపాటి చలి జ్వరం వైరల్ బ్రాంకైటిస్ లక్షణాలని, ఇటువంటి కేసుల్లో సాధ్యమైనంత వరకు యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా ఉండాలని ఐసీఎంఆర్ పేర్కొంది. ఒకవేళ ఇవ్వదలచుకుంటే పేషెంట్ యొక్క హిస్టరీని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది.
మన దేశంలో చాలా మంది రోగులకు అత్యంత శక్తివంతమైన కార్బాపినమ్ యాంటీబయాటిక్ ను ఇచ్చినా ప్రయోజనం ఉండటం లేదని, దీనికి బ్యాక్టీరియా త్వరగా లొంగడం లేదని, ఇందుకు కారణం విపరీతంగా చిన్న చిన్న రోగాలకు కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వడమేనని ఐసీఎంఆర్ పేర్కొంది. మొత్తానికి ఐసీఎంఆర్ తాజా సర్వే తో విపరీతంగా యాంటీబయాటిక్స్ ను చిన్నచిన్న అనారోగ్యాలకు ఉపయోగిస్తే, అవి సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో పని చేయబోవని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే యాంటీబయాటిక్స్ పట్ల అటు డాక్టర్లు ఇటు ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం, అధిక వినియోగాన్ని నిరోధించాల్సిన అవసరం ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications