భారత గగనతలంలోకి పాకిస్తాన్ హెలికాప్టర్, పేల్చేసే ప్రయత్నం చేసిన ఆర్మీ (వీడియో)
న్యూఢిల్లీ: భారత గగనతలంలోకి పాకిస్తాన్కు చెందిన విమానం ఒకటి వచ్చింది. జమ్ము కాశ్మీర్లోని పూంచ్ ప్రాంతంలో ఈ విమానం కనిపించింది. భారత సైన్యం దానిని పేల్చివేసేందుకు ప్రయత్నాలు చేసింది. భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ లేదా ఎల్ఓసీలో పరిమిత పరిధిలోకి ఏ హెలికాప్టర్ రావొద్దు.
నిబంధనలు ఉల్లంఘించి పాకిస్తాన్ హెలికాప్టర్ భారత భూభాగంలోని గగనతలంలోకి వచ్చింది. ఎల్ఓసీ దాటి కృష్ణ ఘటి సెక్టార్లోని గుల్పర్ ప్రాంతంలో మధ్యాహ్నం 12.13 నిమిషాలకు భారత గగన తలంలోకి అక్రమంగా ప్రవేశించిందని రక్షణశాఖ అధికారులు తెలిపారు.
ఆ సమయంలో హెలికాప్టర్ వెళ్తున్న మార్గం వైపు భారత జవాన్లు కాల్పులు జరిపి పైలట్ను హెచ్చరించారని తెలిపారు. దీంతో విమానం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వైపు తిరిగి వెళ్లిపోయిందన్నారు.
#WATCH A Pakistani helicopter violated Indian airspace in Poonch sector of #JammuAndKashmir pic.twitter.com/O4QHxCf7CR
— ANI (@ANI) September 30, 2018
వీడియోలో పాకిస్తాన్కు చెందిన తెలుపు రంగు హెలికాప్టర్ పూంచ్ హిల్స్లో చక్కెర్లు కొడుతూ కనిపించింది. ఆ సమయంలో హెలికాప్టర్ను చిన్నపాటి కాల్పులతో హెచ్చరించారు. పెద్ద యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఆయుధాలు ఉపయోగించలేదు.
గతంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎల్వోసీ నుంచి 300 మీటర్ల దూరంలో ఓ పాకిస్తాన్ హెలికాప్టర్ కనిపించింది. ప్రస్తుత హెలికాప్టర్ దారి తప్పి మన భూభూగంలోకి వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది.