Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత బోటుపై పాక్ కాల్పులు: మత్స్యకారుడి మృతి

న్యూఢిల్లీ: గుజరాత్ తీరం వెంబడి అంతర్జాతీయ జలాల్లో ఉన్న భారత మత్స్యకారుల బోటుపై పాకిస్థాన్ తీర రక్షక దళం దాడి చేసింది. పాక్ దళం జరిపిన కాల్పుల్లో బోటులోని ఇక్బాల్ అనే భారతీయ మత్స్యకారుడు మరణించాడు.

ప్రేమ్‌రాజ్ అనే పేరున్న ఈ బోటు 8వ తేదీన ఐదుగురు మత్స్యకారులతో ఓఖా తీరం నుంచి బయలుదేరినట్టు తెలుస్తోంది. ఈ బోటులో మరణించిన ఇక్బాల్ పోరుబందర్ పట్టణానికి చెందినవాడని అధికారులు తెలిపారు.

విషయం తెలుసుకున్న భారత కోస్ట్ గార్డ్ రెండు చిన్న షిప్ లను ఆ ప్రాంతానికి పంపింది. జరిగిన ఘటనపై విచారించడంతో పాటు, ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్స్ మొదలు పెట్టినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

Pakistan marines open fire on Indian boats, one killed: Report

సైన్యం కాల్పుల్లో ఉగ్రవాదుల హతం

జమ్మూకాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్ వద్ద భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా దళాలు అడ్డుకున్నాయి. గత రాత్రి నుంచి భారత సైనికులు ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు సీనియర్ అధికారులు తెలిపారు. మరోవైపు పూంఛ్ జిల్లా నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ భారత సైనికుడు గాయపడ్డాడు.

భారత హైకమిషనర్‌కు పాక్‌ సమన్లు

భారత హైకమిషనర్‌కు పాకిస్థాన్‌ శుక్రవారం సమన్లు జారీ చేసింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్‌ ఉల్లఘించిందని.. ఈ కాల్పుల్లో తమ పౌరులు గాయపడ్డారని పాక్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+