LoC: రాత్రికి రాత్రే హై అలర్ట్! భారత్ లోకి చొరబడిన పాక్ డ్రోన్..

భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ మళ్లీ కుట్రలకు తెరలేపింది. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) వెంట శత్రు దేశం నుంచి వచ్చిన డ్రోన్ ఒకటి ప్రత్యక్షం కావడంతో సరిహద్దులో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పూంచ్ జిల్లా సరిహద్దుల్లో ఈ సస్పెక్టెడ్ డ్రోన్ కదలికలు కనిపించడంతో మన రక్షణ దళాలు తక్షణమే అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లోని ఆర్మీ బలగాలు రాత్రికి రాత్రే అదనపు నిఘాను ఏర్పాటు చేసి, సరిహద్దు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

శుక్రవారం రాత్రి 8:05 గంటల సమయంలో పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన ఒక అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ (UAV) భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. 22 జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ పర్యవేక్షణలో ఉండే పూంచ్ జిల్లా మెంధార్ సెక్టార్‌లోని బెహ్రూటీ గ్రామంపై ఈ డ్రోన్ కొద్దిసేపు తిరిగింది. ఆ తర్వాత మంగళ్‌నార్-దబ్రోత్ వైపు కదులుతూ మన భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించింది. అయితే సరిహద్దుల్లో కాపలా కాస్తున్న మన జవాన్లు తక్షణమే స్పందించడంతో, ఆ డ్రోన్ వెనక్కి తగ్గి తిరిగి పాకిస్తాన్ వైపు వెళ్లిపోయింది.

Pakistani Drone Incursion Attempt Foiled in Poonch Indian Army Escalates Border Surveillance
స్నాప్‌చాట్ లవ్.. కాశ్మీర్ అమ్మాయి కోసం LoC దాటిన POK కుర్రాడు..?
స్నాప్‌చాట్ లవ్.. కాశ్మీర్ అమ్మాయి కోసం LoC దాటిన POK కుర్రాడు..?

నేలను చల్లబెడుతున్న కూంబింగ్ ఆపరేషన్లు

డ్రోన్ వెనక్కి వెళ్లినప్పటికీ, అది మన సరిహద్దుల్లోకి ఆయుధాలు, డ్రగ్స్ లేదా పేలుడు పదార్థాలను ఏమైనా డ్రాప్ చేసిందా అన్న కోణంలో ఆర్మీ శనివారం ఉదయాన్నే భారీ సార్చ్ ఆపరేషన్ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, బీఎస్‌ఎఫ్, సైనిక దళాలు కలిసి అడవులు, ముందు వరుస గ్రామాల్లో జల్లెడ పడుతున్నాయి. ఏ చిన్న అనుమానాస్పద వస్తువు దొరికినా స్వాధీనం చేసుకునేలా నిఘా వ్యవస్థను మరింత పెంచారు.

వరుస ఘటనలతో పెరిగిన ఆందోళన

గత కొద్దివారాలుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల చొరబాట్లు ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలోనే కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోనూ, గత నెలలో రాజౌరీలోని సుందర్‌బని సెక్టార్‌లోనూ పాక్ డ్రోన్లు కనిపించాయి. జూన్ నెలలోనూ బాలాకోట్ సెక్టార్‌లోనే డ్రోన్ రాగా, మన బలగాలు కాల్పులు జరపడంతో అది పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి పారిపోయింది. ఉగ్రవాదులకు ఆయుధాలు చేరవేయడమే లక్ష్యంగా పాక్ ఈ తరహా కుట్రలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

భారత్ లోకి చొరబడేందుకు 1500 మంది ఉగ్రమూకలు సిద్ధం? అల్ట్రా హై అలర్ట్ ప్రకటించిన భారత సైన్యం..!
భారత్ లోకి చొరబడేందుకు 1500 మంది ఉగ్రమూకలు సిద్ధం? అల్ట్రా హై అలర్ట్ ప్రకటించిన భారత సైన్యం..!

టర్కీ విమానాల ప్రయాణంపై అనుమానాలు!

మరొకవైపు, ఇస్లామాబాద్‌తో టర్కీ జరుపుతున్న సైనిక సంబంధాలు కూడా భారత రక్షణ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలే టర్కీకి చెందిన రవాణా విమానాలు భారీ సంఖ్యలో పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్, మస్రూర్, మురీద్ ఎయిర్ బేసుల్లో ల్యాండ్ అయినట్లు ఫ్లైట్ ట్రాకర్ల ద్వారా వెల్లడైంది. ఈ విమానాల్లో పాకిస్తాన్‌కు అధునాతన డ్రోన్లు లేదా సైనిక ఆయుధాలు సరఫరా అయ్యాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత భద్రతా దళాలు ఎల్‌ఓసీ వెంట మరింత కఠినమైన నిఘాను కొనసాగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+