వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనగర్ ఎన్ కౌంటర్: లషర్కే ఉగ్రవాదులు అంతం

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా పాంపోర్ లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ బుధవారం మధ్యాహ్నం తరువాత ముగిసింది. దాదాపు 62 గంటల పాటు సాగిన ఆపరేషన్ లో పారా కమెండోలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపేశారు.

ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్ (ఈడీఐ) హాస్టల్ భవంతిలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు భారత ఆర్మీ దెబ్బకు అంతం అయ్యారు. ఎన్ కౌంటర్ లో అంతం అయిన ఇద్దరు ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

Pampore Encounter near Srinagar ends after 62 hours

ఆపరేషన్ కు నేతృత్వం వహించిన జీవోసీ విక్టర్ ఫోర్స్ కు చెందిన మేజర్ జనరల్ అశోక్ నరూలా
మీడియాకు వివరాలు వెల్లడించారు. సోమవారం వేకువ జామున పడవలో జీలం నదిని దాటి వచ్చిన ఉగ్రవాదులు ఈడీఐ భవంతిలో నక్కారని చెప్పారు.

అప్పటి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు కాల్పులు జరిగాయని అన్నారు. భద్రతా బలగాలు భవనంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను అంతం చేశారని అన్నారు. ఉగ్రవాదులు ఇద్దరూ లష్కరే -ఏ-తోయిబా గ్రూప్ కు చెందిన వారని వివరించారు.

Pampore Encounter near Srinagar ends after 62 hours

భవంతిలో మొత్తం 122 గదులు ఉన్నాయని, అణువణువూ తనిఖీ చేస్తున్నామని చెప్పారు. మనవైపు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మేజర్ జనరల్ అశోక్ నరూలా స్పష్టం చేశారు. పాంపోర్ ఘటనను ఉగ్రవాదుల పిరికి చర్యగా అభివర్ణించారు.

మొదట ముగ్గురు ఉగ్రవాదులు ఈడీఐ భవనంలోకి చొరబడ్డారని అనుమానించారు. మోర్టార్ షెల్ష్ తో ప్రతిదాడి చేశారు. చివరికి పారా కమెండోలు రంగంలోకి దిగి ఉగ్రవాదులను అంతం చేసి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశారని మేజర్ జనరల్ అశోక్ నరూలా వివరించారు.

English summary
One terrorist was killed yesterday and another was shot dead today at the battered Entrepreneurship Development Institute building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X