కొలువుదీరిన 17వ లోక్సభ.. ప్రమాణస్వీకార సమయంలో మోడీ.. మోడీ నినాదాలు హోరెత్తిన సభ..
ఢిల్లీ : 17వ లోక్సభ కొలువుదీరింది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీఏ 2 సర్కారు ఏర్పడిన అనంతరం తొలిసారి లోక్సభ సమావేశాలు ప్రారంభమైంది. కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారంతో మొదటి రోజు సభ షురువైంది. తొలుత ప్రధాని నరేంద్రమోడీ లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్రకుమార్ మోడీతో ప్రమాణం చేయించారు. మోడీ ప్రమాణ స్పీకారం చేస్తున్న సమయంలో లోక్సభ మోడీ మోడీ నినాదాలతో దద్దరిల్లింది. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ కొడికున్నిల్, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా వరుసగా ప్రమాణం చేశారు.
సోమ, మంగళవారాల్లో ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగనుంది. కేంద్ర మంత్రులు, ప్యానెల్ ఛైర్మన్ల అనంతరం ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఏపీ నుంచి లోక్సభకు ఎన్నికైన ఎంపీల్లో పలువురు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం బుధవారం స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ రేసులో మేనకాగాంధీ, రాధా మోహన్ సింగ్, అహ్లూవాలియా, జువెల్ ఓరామ్ పేర్లు వినిపిస్తున్నాయి.

అంతకు ముందు బీజేపీ సీనియర్ ఎంపీ వీరేంద్ర కుమార్ లోక్సభ ప్రొటెం స్పీకర్గా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications