కోర్టులో ఊరట: ఆగస్ట్ 7 వరకు చిద్దూను అరెస్ట్ చేయొద్దు, కార్తి విదేశాలకు వెళ్లొచ్చు
న్యూఢిల్లీ: ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరానికి ఊరట లభించింది. చిదంబరాన్ని ఆగస్టు 7వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని పటియాలా హౌస్ కోర్టు సోమవారం ఆదేశించింది. ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
అంతకుముందు, చిదంబరం ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయస్థానం మధ్యాహ్నం విచారణ చేపట్టింది.

కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం ఓకే
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తి చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అనుమతించింది. జూలై 23వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య ఆయన అమెరికా, ఫ్రాన్స్, యూకే వెళ్లేందుకు సుప్రీం ఓకే చెప్పింది.












Click it and Unblock the Notifications