ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం: పైలట్ చాకచక్యంతో గాయాలతో బయటపడిన ప్రయాణికులు, సిబ్బంది
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి పాట్నాకు వెళ్లే ఎయిరిండియా విమానం (నంబర్ AI-415).. గాలి అల్లకల్లోలం కారణంగా పలువురు ప్రయాణికులు, సిబ్బంది పాక్షికంగా గాయపడ్డారు. బలమైన గాలుల కారణంగా విమానం బ్యాలెన్స్ తప్పడంతో పాట్నా విమానాశ్రయంలో ల్యాండింగ్ను నిలిపివేశారు. సోమవారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
15 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టిన తర్వాత పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ సంఘటన విమానంలోని ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. ఒక ప్రయాణికుడి తలకు గాయం కాగా, కొందరు సిబ్బంది కింద పడిపోయారు. లగేజీ విభాగం తాళం వేసి ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదు. అయితే, విమానం బ్యాలెన్స్ తప్పడంతో ఆ తాకిడికి టాయిలెట్ డోర్ కూడా బద్దలైంది.

ఈ విమానంలో సిబ్బందితో పాటు 122 మంది ప్రయాణికులు ఉన్నారు. ల్యాండింగ్ తర్వాత వారు ఒక నిట్టూర్పు విడిచారు. పరిస్థితిని నైపుణ్యంగా నిర్వహించినందుకు పైలట్కు వారంతా ధన్యవాదాలు తెలిపారు. మరమ్మత్తు, తనిఖీ కోసం విమానాన్ని పాట్నా విమానాశ్రయంలోనే ఉంచారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ)కి ప్రాథమిక నివేదిక పంపబడింది
అయితే సంఘటనకు గల కారణాలపై అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు. నివేదిక ప్రకారం.. ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేదా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ద్వారా గుర్తించబడని రన్వేపై ల్యాండ్ చేయబోతున్నప్పుడు విమానం బలమైన గాలులతో దెబ్బతింది. గాలిలో అల్లకల్లోలంగా అనిపించిన తర్వాత, పైలట్ వేగాన్ని పెంచి.. క్రాష్ కాకుండా ఉండటానికి విమానాన్ని పైకి తీసుకెళ్లారు. కాగా, దీన్ని ల్యాండ్ అబార్ట్ అని పిలుస్తారు. ఇది అరుదైన, ప్రమాదం నుంచి తప్పించే ఉపాయంగా చెబుతారు.












Click it and Unblock the Notifications