సరిహద్దు ఉగ్రవాదంతో ముప్పు - సవాళ్లను అధిగమిస్తేనే శాంతి - సార్క్ సమావేశంలో జైశంకర్
సరిహద్దుల వెంబడి ఉగ్రవాద కార్యకలాపాలు, దొడ్డిదారుల్లో వాణిజ్యం వల్ల దేశాలు పెను ముప్పును ఎదుర్కొంటాయని, కూటములు పరిష్కరించుకోవాల్సిన ప్రధాన సవాళ్లు కూడా ఇవేనని, వీటిని అధిగమిస్తేనే దక్షియాసియాలో శాంతి, శ్రేయస్సు, భధ్రత శాశ్వతంగా ఉంటాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
ఐక్యరాజ్య సమితి 75వ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. పలు దేశాల కూటములు సైతం సదస్సులు నిర్వహిస్తుండటం తెలిసిందే. ఆ క్రమంలోనే గురువారం ఆన్లైన్ ద్వారా జరిగిన సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశకంర్ పాల్గొన్నారు. గడిచిన మూడున్నర దశాబ్దాలుగా సార్క్ గణనీయమైన పురోగతి సాధించిందని ఆయన గుర్తుచేశారు. అయితే..

పొరగు దేశాలతోపాటు యావత్ దక్షిణాసియాలో పరస్పర సహకారం, శ్రేయస్సు కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఉగ్రవాద చర్యలు అడ్డంకిగా మారాయని, పరోక్షంగా పాకిస్థాన్పై జైశంకర్ మండిపడ్డారు. దక్షిణాసియా పురోగతి, భద్రత, సమగ్రత కోసం పొరుగు దేశానికి మొదటి ప్రాధాన్యత అన్న విధానాలకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుదని చెప్పారు.
కరోనా విలయకాలంలో భారత్ చురుకుగా వ్యవహరించిందని, సార్క్ దేశాలకు తక్షణ సహాయం కింద అత్యవసర మందులు పంపడంతోపాటు పరీక్ష కోసం కోసం పది మిలియన్ డాలర్ల అత్యవసర నిధి ఏర్పాటు చేస్తామనీ ప్రకటించిన విషయాన్ని మంత్రి పేర్కొన్నారు. కరోనాపై సమాచారం మార్పిడిని మరింత సులభతరం చేసేందుకు కోవిడ్ -19 ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ ప్లాట్ఫామ్ (కోయినెక్స్)ను భారత్ ప్రారంభించిందని చెప్పారు. సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఆధ్వర్యంలో వినూత్న వెబ్సైట్ అభివృద్ధికి ఇది దోహదపడిందని అన్నారు.
కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు సార్క్ ఫుడ్ బ్యాంక్ విధానం కోసం కూడా ఉపయోగపడుతుందని, సభ్యదేశాలైన మల్దీవులకు 150 మిలియన్ డాలర్లు, భూటాన్కు 200 మిలియన్ డాలర్లు, శ్రీలంకకు 400 మిలియన్ డాలర్ల సహాయ నిధిని ఈ ఏడాది భారత్ అందజేస్తుందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి కూడా పాల్గొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications