Periyar: కుల సంకెళ్లను తెంచి, మూఢనమ్మకాల గోడలను కూల్చిన పెను తుఫాన్

Periyar: పెరియార్.. ఓ మహానుభావుడిగా పేరు పొందిన వెంకటప్ప రామసామి, 1879 సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఈరోడ్‌లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచే సమాజంలోని వైరుధ్యాలను, అన్యాయాలను ప్రశ్నించేవారు. మత గ్రంథాలు తర్కానికి విరుద్ధంగా ఉండటం, మనిషిని కులం పేరుతో కించపరచడం వంటి అంశాలు పెరియార్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. మతం అనేది ప్రజలను అణచివేయడానికి ఉపయోగించే ఒక సాధనమని గ్రహించి.. అందరి ఆత్మగౌరవం కోసం పోరాడాలని ఆయన నిర్ణయించుకున్నారు.

రాజకీయాల్లో తొలి అడుగులు.. కాంగ్రెస్‌తో విభేదాలు
1919లో పెరియార్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరారు. ఈరోడ్ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు, ఖాదీ ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ, అంటరానితనం నిర్మూలన వంటి కార్యక్రమాలను చేపట్టారు. వీటిలో భాగంగా 1921లో జైలుకు కూడా వెళ్లారు. అయితే, త్వరలోనే కాంగ్రెస్‌లో కూడా కుల వివక్ష ఉందని పెరియార్‌కు అర్థమైంది. ముఖ్యంగా 1922లో వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని పెరియార్ చేసిన డిమాండ్‌ను మహాత్మా గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరాశ చెందిన పెరియార్, 1925లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. అంతేకాకుండా, "నేను తమిళనాడులో కాంగ్రెస్‌ను శాశ్వతంగా అధికారంలోంచి కూలదోస్తాను" అని శపథం చేశారు. చరిత్ర దీనికి సాక్ష్యంగా నిలిచింది - గడచిన 58 సంవత్సరాలుగా తమిళనాడులో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది.

Periyar The Storm Who Shattered Caste Chains and Superstitions

వైకోమ్ సత్యాగ్రహం.. ఆత్మగౌరవ ఉద్యమం
ట్రావెన్‌కోర్ సంస్థానంలో 1924లో జరిగిన వైకోమ్ సత్యాగ్రహంలో పెరియార్ యాక్టివ్‌గా పాల్గొన్నారు. అంటరానివారుగా పరిగణించబడిన ప్రజలను ఆలయానికి వెళ్లే రోడ్లపైన నడవకుండా కుల వివక్ష అడ్డుకున్నప్పుడు.. పెరియార్ ఆ పోరాటంలో అడుగుపెట్టారు. గాంధీజీ అభ్యంతరం తెలిపినప్పటికీ, ఆయన వెనుకాడలేదు. అన్యాయం ఎక్కడ జరిగినా అది అందరి మనస్సాక్షిని కదిలించాల్సిన అంశమని పెరియార్ భావించారు. ఈ నిర్భయమైన ధైర్యానికి ఆయనకు "వైకోమ్ వీరర్" అనే బిరుదు కూడా లభించింది.

1925 నుండి పెరియార్ స్వీయ-గౌరవ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది గుడ్డి నమ్మకాలు, హేతుబద్ధం కాని ఆచారాలు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక విస్తృత పోరాటంగా మారింది. 'కుడి అరసు', 'రివోల్ట్' వంటి పత్రికల ద్వారా హేతువాదం, సమానత్వం వంటి అంశాలను ప్రచారం చేశారు. ఈ ఉద్యమం మహిళా విద్య, వితంతు పునర్వివాహం, పూజారులు లేకుండా వివాహాలను ప్రోత్సహించింది.

ద్రవిడర్ కజగం ఆవిర్భావం.. చివరి ప్రస్థానం
1944లో పెరియార్ జస్టిస్ పార్టీని ద్రవిడర్ కజగం (DK) గా మార్చి తన పోరాటాన్ని కొనసాగించారు. పెరియార్ హేతువాదం, మహిళా హక్కులు, కుల ఆధిపత్యం వంటి అంశాలను వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యపరిచారు. వృద్ధాప్యంలో కూడా పెరియార్ పోరాటం ఆగలేదు. 1958లో బెంగళూరులో జరిగిన అధికార భాషా సదస్సులో హిందీని రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి.. ఇంగ్లీష్‌ను ఐక్యతకు నిజమైన వారధిగా పేర్కొన్నారు. 1963లో ఉత్తర భారతంలో పర్యటించి, కుల నిర్మూలన ప్రతి భారతీయుడి అత్యున్నత కర్తవ్యమని ప్రకటించారు.

1973 డిసెంబర్ 19న, చెన్నైలో పెరియార్ చివరి ఉపన్యాసం ఇచ్చారు. అది సమానత్వం, హేతువాదం కోసం ఇచ్చిన తుది పిలుపు. ఇజది జరిగిన సరిగ్గా ఐదు రోజుల తర్వాత, 1973 డిసెంబర్ 24న, 94 ఏళ్ల వయసులో ఆ మహానుభావుడు తుది శ్వాస విడిచారు. ఆయన వారసత్వం నేటికీ, కులానికి తలవంచని ప్రతి గళంలో, విద్య కోసం పోరాడే ప్రతి మహిళలో, మూఢనమ్మకాలను ప్రశ్నించే ప్రతి హేతువాదిలో సజీవంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+