ఆ నిర్ణయంతో షాకయ్యా! కరుణ అంత్యక్రియలపై వెంటనే మోడీకి ఫోన్ చేశా: మమత బెనర్జీ
చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్లో జరిపేందుకు మొదట రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించని విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి తాను వ్యక్తిగతంగా షాకయ్యానని, వెంటనే ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు.
'మెరీనా బీచ్లో కరుణానిధి అంతిమ సంస్కారాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిసి, నేను నిన్న చాలా బాధపడ్డాను. ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో మాట్లాడటానికి ఫోన్ చేశాను. కానీ, ఆయన అందుబాటులో లేరని ఆయన సిబ్బంది చెప్పారు. దీంతో నేను ఈ విషయంపై మాట్లాడడానికి ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశాను' అని మమతా బెనర్జీ మీడియాకు తెలిపారు.

మంగళవారం సాయంత్రం 6.10గంటలకు కరుణానిధి మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే మమతా బెనర్జీ మంగళవారం రాత్రే చెన్నైకి చేరుకున్నారు. కరుణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాగా, బుధవారం కరుణానిధి అంత్యక్రియలకు తృణమూల్ కాంగ్రెస్ తరపున ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ హాజరుకానున్నారు.
కాగా, కరుణానిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్లో జరిపేందుకు మొదట ప్రభుత్వం అంగీకరించకపోయినప్పటికీ మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్లో జరుగుతున్నాయి.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications