ఇద్దరు కామాంధుల నుంచి బాలికను కాపాడిన పెంపుడు కుక్క
భోపాల్: ఓ బాలికను ఆమె పెంపుడు కుక్క కామాంధుల నుంచి కాపాడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసింది. రేపిస్టులను కరిచి వారు అక్కడి నుంచి పారిపోయేలా చేసింది పెంపుడు శునకం.
సాగర్ జిల్లా కరీలా గ్రామానికి చెందిన ఓ బాలిక గత శుక్రవారం రాత్రి పని ఉండి బయటకు వెళ్లింది. బాలిక ఒంటరిగా రావడం గమనించిన ఇద్దరు యువకులు ఆమెను అడ్డగించారు. కత్తితో బెదిరించారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లారు.

ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. అయితే బాలిక అరుపులు విన్న పెంపుడు కుక్క ఘటనాస్థలికి వెళ్లి నిందితులపై దాడి చేసింది. ఆ తర్వాత ఆ బాలిక అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి పరుగెత్తికి వచ్చింది. కుక్క అరవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితులు.. మైనర్ బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించి సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న పశువుల దాణా గదికి తీసుకు వెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. శునకం వచ్చి వారిని కరవడమే కాకుండా, అరిచింది. దీంతో స్థానికులు అక్కడకు వచ్చారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications