టీటీవీ దినకరన్ ఇంటిపై పెట్రో బాంబు దాడి యత్నం, కారులో పేలింది
చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ అధినేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ఇంటిపై ఆదివారం పెట్రో బాంబు దాడికి ప్రయత్నం జరిగింది. ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఓ కారు ధ్వంసమైంది. ఆ సమయంలో దినకరన్ లేరు.
ఇటీవల బుల్లెట్ పరిమళం అనే వ్యక్తిని పార్టీ నుంచి తొలగించారు. దీంతో దినకరన్పై పగ పెంచుకున్న పరిమళం ఆయన ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరాలని నిర్ణయించుకున్నాడు. బాంబును కారులో తీసుకుని ఆదివారం మధ్యాహ్నం దినకరన్ ఇంటి సమీపానికి చేరుకున్నాడు.

ఆ సమయంలో పెట్రోల్ బాంబు అదే కారులో పేలింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురు వ్యక్తులతో పాటు సమీపంలో ఉన్న ఓ ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి బుల్లెట్ పరిమళాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications