మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్-విజయవాడల్లో ధర ఎంత అంటే?
ఢిల్లీ: పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. రికార్డ్ స్థాయికి ధరలు పెరిగాయి. గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ.85.35, డీజిల్ రూ.78.98గా ఉంది. పెట్రోల్ ధరలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి.
పెరుగుతున్న పెట్రోల్ ధరలపై విపక్షాలు సోమవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. భారత్ బంద్కు ముందు రోజు పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరల పెరుగుదలపై శివసేన బీజేపీపై విమర్శలు గుప్పించింది. అచ్చేదిన్ అంటే ఇదేనా అని ఎద్దేవా చేసింది.
పెట్రోల్ ధరలు ఢిల్లీలో 80.50గా, డీజిల్ ధర రూ.72.61గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధరలు 83.54, డీజిల్ ధర రూ.75.75గా ఉంది. కోల్కతాలో పెట్రోల్ ధర రూ.83.27గా, డీజిల్ 75.46, ముంబైలో పెట్రోల్ ధర 87.89గా, డీజిల్ రూ.77.09గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.86.81గా, డీజిల్ రూ.80గా ఉంది.

కాగా, పెట్రోల్ ధరలు పెరగడానికి అంతర్జాతీయస్థాయి కారణాలు ఉంటాయి. మరోవైపు, గత యూపీఏ ప్రభుత్వం చేసిన వేలాది కోట్ల అఫ్పును నేటి ఎన్డీయే ప్రభుత్వం తీర్చిందని, అందుకు కూడా ధరలు తగ్గడం లేదని చెబుతున్నారు. పెట్రోల్ ధరలు మన్మోహన్ సింగ్ హయాంలో కూడా రూ.80 దాకా ఉన్నాయని, నాటితో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగింది ఎక్కువ కాదనే వాదనలు కూడా ఉన్నాయి.
కాగా, పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాలంటే నవంబర్ వరకు నిరీక్షించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. నాలుగు రాష్ట్రాల శాసనసభలకు ఆ నెలలో ఎన్నికలు జరిగే అవకాశముంది.
-
లీటర్ పెట్రోల్ రూ. 321, కిరోసిన్ రూ. 433, డీజిల్ రూ. 345.. ఎమర్జెన్సీ ప్రకటన.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications