కుంభమేళలో ఘోరం..మహిళల స్నానాల ఫొటోలు, నగ్న వీడియోలు రికార్డు చేసి ఆ పని
మహా కుంభమేళా తుది చేరుకు చేరుకుంది. శివరాత్రి పర్వదినంతో కుంభమేళా ముగియనుంది.144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా, ఫిబ్రవరి 26తో ముగియనుంది. మరో నాలుగు రోజులు మాత్రమే సమయంలో ఉండటంతో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తలు దేశ వ్యాప్తంగా తరలి వస్తున్నారు.
మొదట్లో ఈ కుంభమేళాకు సుమారు 45 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేసుకున్నప్పటికీ, అంతకు మించిన స్థాయిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇప్పటి వరకు 56 కోట్లకు పైగానే భక్తులు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచారించారని తెలుస్తోంది.ఈసారి మహిళలు సైతం భారీగా కుంభమేళాలో స్నానాలు ఆచారించారు. అయితే కుంభమేళాలో పుణ్యస్నానాలకు వచ్చిన మహిళలు దుస్తులు మార్చుకుంటున్న సమయంలో కొందరు ఫొటోలు, వీడియోలు సీక్రెట్గా రికార్డు చేశారు.

కుంభమేళాలో కొన్ని చోట్ల మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించకపోయింది. దీంతో మహిళలు పుణ్యస్నానాలు చేసిన దగ్గరే దుస్తులు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు దుర్మార్గులు అమ్మాయిలు, మహిళలు దస్తులు మార్చుకున్న ఫొటోలను, వీడియోలను వారికి తెలియకుండా సీక్రెట్గా రికార్డు చేశారు. అయితే అలా రికార్డు చేసిన వీడియోలను, ఫొటోలను ఆన్లైన్లో ఉంచుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.అయితే ఈ వీడియోలు, ఫొటోలను చూడాలంటే డబ్బులు చెల్లించాలని ఆ కేటుగాళ్లు సోషల్ మీడియాలో లింక్లు షేర్ చేశారు. దీంతో తతంగం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన అమ్మాయిలు, మహిళలు ఆందోళనకు గురవుతున్నారు.ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం సీరియస్ అయింది. దీని వెనకాల ఉన్న కేటుగాళ్లు తాటతీస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనకు కారణమైన అకౌంట్ లు ఉన్న వారి సమాచారం ఇవ్వాలని యూపీ పోలీసులు మెటా సంస్థలకు ప్రత్యేకంగా లెటర్ లు రాయడం జరిగింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications