Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుగుబాటు సరే..ఏక్‌నాథ్ షిండేకు చిక్కులు: బోంబే హైకోర్టులో పిల్: రెబెల్స్‌పైనా

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న రాజకీయ సంక్షోభం ఇక న్యాయస్థానాల గడప తొక్కింది. తిరుగుబాటు వర్గానికి నాయకత్వాన్ని వహిస్తోన్న శివసేన సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొన్ని గంటల్లోనే ఆయనకు వ్యతిరేకంగా మరో పిటీషన్ దాఖలైంది. బోంబే హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీన్ని బోంబే హైకోర్టు విచారణకు స్వీకరించింది.

ఏక్‌నాథ్ షిండే.. తన వర్గానికి చెందిన శాసన సభ్యులపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో ఆయన రెండు పిటీషన్లు దాఖలు చేశారు. ఇందులో డిప్యూటీ స్పీకర్‌ను ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మధ్యాహ్నం 12:30 స్పెషల్ వెకేషన్ బెంచ్ దీన్ని విచారించనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీస్‌కు వ్యతిరేకంగా ఒకటి, లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అజయ్ చౌధరిని అపాయింట్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటీషన్లు టి దాఖలయ్యాయి.

ప్రఖ్యాత న్యాయవాది హరీష్ సాల్వే..ఏక్‌నాథ్ షిండే తరఫున విచారణకు హాజరు కానున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తరఫున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ, తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తమ వాదనలను వినిపించనున్నారు. ఈ మేరకు జంధ్యాల రవిశంకర్ ఆదివారం రాత్రి ముంబైలోని వర్షా బంగళాలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలుసుకున్నారు. ఈ పిటీషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

PIL filed against Eknath Shinde and other rebel Shiv Sena MLAs in Bombay High Court

కాగా- ఏక్‌నాథ్ షిండే, తిరుగుబాటు శాసన సభ్యులపై బోంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. షిండే, ఇతర రెబెల్ ఎమ్మెల్యేలు తమ బాధ్యతలను విస్మరించి, హోటల్‌లో కాలక్షేపం చేస్తోన్నారంటూ ఈ పిటీషన్‌లో పేర్కొన్నారు. తమ రోజువారీ ప్రజా ప్రయోజనాల కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ఆదేశించాలని కోరారు. ఉత్పల్ బాబురావు చందవార్, ఈ పిల్ వేశారు. బోంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ఎంఎస్ కార్ణిక్‌తో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

పిటీషనర్ల తరఫున అడ్వొకేట్ అసీం సరోదే తన వాదనలను వినిపించారు. మరో న్యాయవాది అజింక్య ఉడనె ఈ వాదనల్లో ఇంప్లీడ్ అయ్యారు. మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రజల అవసరాలు, వారి హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయని చెప్పారు. శాసన సభ్యులు తమ బాధ్యతలను విస్మరించారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాల వల్ల చివరికి ప్రజలు నష్టపోవాల్సి వస్తోందని అన్నారు. ఈ వ్యవహారం అంతా పబ్లిక్ న్యూసెన్స్‌లా ఉందని వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+