ఇరాక్ మృతుల ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఇరాక్లోని మోసూల్లో ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 39 మంది భారతీయుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ నష్టపరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇరాక్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పంజాబ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనకు దిగిన అనంతరం ప్రధాని పరిహారం ప్రకటించారు.
కాగా, పంజాబ్కు చెందిన బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇంతకుముందే ప్రకటించారు.

విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వీకే సింగ్ స్వయంగా బాగ్దాద్ వెళ్లి.. అక్కడ్నుంచి మృతుల భౌతిక కాయాలను సోమవారం భారత్కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 39 మంది చనిపోగా డీఎన్ఏ నమూనాలు సరిపోలిన 38మంది మృతదేహాలను మాత్రమే భారత్కు తీసుకొచ్చారు.
చనిపోయిన వారంతా 2014లో ఓ ఏజెంట్ ద్వారా అక్రమ మార్గంలో ఇరాక్ వెళ్లి అక్కడ కార్మికులుగా పనిచేశారు. ఉగ్రవాదులు 40 మందిని అపహరించగా ఒక వ్యక్తి మాత్రం తాను బంగ్లాదేశ్ ముస్లింనని చెప్పి తప్పించుకున్నాడు. మిగతా 39మందిని ఉగ్రవాదులు చంపేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications