నేడు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల?.. రైతులు ఇలా చెక్ చేసుకోండి..!
దేశంలోని రైతులకు గుడ్ న్యూస్. చాలా రోజులుగా పీఎం కిసాన్ నిధుల కోసం వేచి చూస్తున్న అన్నదాతల ఖాతాల్లో 20వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్రం సిద్దం అవుతోంది. ఇటు ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేసేందుకు సిద్దమైంది. ఇవాళ తెలంగాణలో రైతులకు పీఎం కిసాన్ డబ్బులు వస్తే.. ఏపీలో పీఎం కిసాన్ డబ్బులతో పాటు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం కోసం అర్హుల జాబితాను దాదాపు ఖరారు చేసారు. అభ్యంతరాల పైన రైతులకు అవకాశం కల్పించారు. దీంతో, రెండు పథకాలు ఒకే సారి అమలు చేస్తే రైతుల ఖాతాల్లో రూ 7 వేలు జమ కానున్నాయి.
నేడు పీఎం కిసాన్ నిధులు!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోడీ నేడు(శుక్రవారం) బీహార్లో జరగనున్న భారీ బహిరంగ సభలో విడుదల చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 9.80 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. కేంద్రం ప్రతీ నాలుగు నెలలకు ఒక సారి ఈ పథకం కింద నిధులు విడుదల చేస్తోంది. 19వ విడత నిధులను 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. గతేడాది జూన్ వాయిదాను నెల ముగియక ముందే విడుదల చేశారు. అయితే ఈ సారి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. కాగా, పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం మూడు విడతలు గా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.

అన్నదాత సుఖీభవ
పీఎం కిసాన్ ద్వారా వచ్చే రూ 2 వేలకు ఏపీ ప్రభుత్వం రూ 5 వేలు చొప్పున రెండు సార్లు, రూ 4 వేలు చివరి విడతలో కలిసి ఇవ్వనుంది. దీని ద్వారా మొత్తంగా ఏడాది కాలంలో రైతు ఖాతాలో రూ 20 వేలు జమ కానున్నాయి. ఇక, పీఎం కిసాన్ 20వ విడతకు సంబధించిన నిధులను నేడు (శుక్రవారం) విడుదల చేసేందుకు కేంద్రం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిసి తొలి విడతగా ఏప్రిల్ - జులై, రెండో విడతగా ఆగస్టు- నవంబర్, మూడో విడతగా డిసెంబర్-మార్చిలో చెల్లింపులు చేయనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు అదనపు ఆర్థిక సహాయం అందాల్సి ఉంది. ఈ స్కీం ద్వారా రాష్ట్ర సర్కారు రూ.14,000 అదనంగా అందిస్తామని చెప్పింది. పీఎం కిసాన్తో కలిపి సంవత్సరానికి రూ.20 వేలు సాయం అందిస్తామని చెప్పింది. నేడు అన్నదాత సుఖీభవను ప్రారంభిస్తారనే ప్రచారం జరుగుతున్నా.. అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. విడుదల చేస్తే రైతుల ఖాతాల్లో మొత్తంగా రూ.7 వేలు జమవుతాయి.
ఇలా చెక్ చేసుకోండి
*నిధులు ఖాతాలో జమ కావాలంటే e-KYC తప్పనిసరిగా పూర్తి చేయాలి.
*పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవటానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్ఓపెన్ చేసి, Know Your Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
*తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ ను నమోదు చేసి, క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి.
*రిజిస్ట్రేషన్ వివరాలు లేకపోతే Know Your Registration Number పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
*ఇప్పుడు Get OTP ఆప్షన్పై క్లిక్చేస్తే మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ వివరాలు ఎంటర్ చేస్తే స్క్రీన్పై మీ బెనిషియరీ స్టేటస్ కనిపిస్తుంది.
*ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ - కేవైసీ చేయించలేదని భావిస్తారు. దీంతో, ప్రతీ లబ్దిదారుడికి ఈ విధానం తప్పని సరి చేసారు. దీంతో.. నేడు (18వ తేదీ), లేదంటే 20న ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications