బంగ్లా బంగారు భవితకు భారత్ భాగస్వామ్యం -ఢాకాలో మోదీకి హసీనా ఘనస్వాగతం
భారత ప్రధాని నరేంద్రమోదీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఘన స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం ఎయిరిండియా విమానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హజ్రత్ షాహజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి హసీనా పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
అనంతరం బంగ్లాదేశ్ రక్షణ బలగాలు ప్రధాని మోదీకి గౌరవ వందనం సమర్పించాయి. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలిసి ఆయన వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ బంగ్లాదేశ్కు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బంగ్లాదేశ్లోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. అదేవిధంగా ప్రధానులిద్దరూ ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. కాగా,
బంగ్లాదేశ్ బంగారు భవితవ్యానికి భారత్ తో భాగస్వామ్యం ఉపకరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. బంగ్లా అధ్యక్షుడు, బంగబంధు షేర్ ముజిబుర్ రెహ్మాన్ హత్య దక్షిణాసియా పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపించిందని, ఆయన బతికుంటే బంగ్లాదేశ్, ఈ ప్రాంతం మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. బంగ్లా పర్యటనకు ముందు ఆ దేశ పత్రిక 'ది డెయిలీ స్టార్'లో మోదీ ప్రత్యేకంగా ఎడిటోరియల్ ఆర్టికల్ రాశారు.
తిరుపతి పోరు: రత్నప్రభ అనూహ్య స్పందన -పవన్ కల్యాణ్ షాకింగ్ తీరు -ఉమ్మడి కమిటీ ఉంటుందా?
'ఇమేజింగ్ ఏ డిఫరెంట్ సౌత్ ఆసియా విత్ బంగబంధు' పేరుతో రాసిన ఈ కథనంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగుదేశాలతో మైత్రిబంధాన్ని కొనసాగిస్తున్న బంగ్లా.. ఆత్మవిశ్వాసంతో నాటి బాధాకర యుద్ధ పరిస్థితుల నుంచి వేగంగా ముందుకు సాగుతోందని, భారత్, బంగ్లా మధ్య బలమైన భాగస్వామ్యం కోసం మళ్లీ ధైర్యంగా అడుగేయాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో మన పార్టీదే విజయం..నేనే తెలంగాణ సీఎం: నేతలతో వైయస్ షర్మిల (ఫోటోలు)