వెంకయ్య నాయుడి ఇంటికి ప్రధాని మోదీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఢిల్లీలో గల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్రమంత్రులు అక్కడికి వెళ్లారు.
న్యూఢిల్లీ: ఎల్లుండి.. తెలుగు సంవత్సరాది ఉగాది (Ugadi). శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆరంభమౌతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ పండగను వైభవంగా జరుపుకోనున్నాయి. దీనికోసం ఆలయాన్ని ముస్తాబవుతున్నాయి. ఉగాది పంచాంగ శ్రవణాన్ని నిర్వహించడానికి ముందుగానే ఏర్పాట్లు సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అధికారికంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

రెండు రోజుల ముందే..
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి ఇంట్లో రెండు రోజులు ముందే ఉగాది పండగ కోలాహలం నెలకొంది. ఉగాది మిలన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారాయన. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఇంటిని అలంకరించారు. సంగీతం, నృత్యం, సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తోన్నారక్కడ.
ప్రతి సంవత్సరం కూడా వెంకయ్య నాయుడు ఉగాది మిలన్ పేరుతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తూ వస్తోన్నారు. పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోన్నారు.

ప్రధాని మోదీ సహా..
ఈ సాయంత్రం ఢిల్లీలోని వెంకయ్య నాయుడి నివాసంలో ఏర్పాటు చేసిన ఉగాది మిలన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ వైస్ ఛైర్మన్ హరివంశ్, పలువురు కేంద్రమంత్రులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ప్రధాని మోదీ జ్యోతి ప్రజ్వలన చేసిన ఈ ఉగాది వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

తెలుగు వారికి శుభాకాంక్షలు..
ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొద్దిసేపు మాట్లాడారు. అనేక రాష్ట్రాలు కొత్త సంవత్సరం వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ఓ ఆనవాయితీగా వస్తోందని, దీన్ని ముందు తరలకూ కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. పండగల వెనుక ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. పశుపక్ష్యాదులను కూడా పూజించడం హిందుత్వలో ఉన్న గొప్పదనమని వ్యాఖ్యానించారు. ప్రతి తెలుగు వారికీ ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తోన్నానని అన్నారు.

తొలిసారిగా..
ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడి పదవీ కాలం పూర్తయిన తరువాత ఆయన నివాసానికి ప్రధాని మోదీ వెళ్లడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంటికి వచ్చిన ఆయనను వెంకయ్య నాయుడు దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఓం బిర్లా, హరివంశ్, సహా పలువురు కేంద్రమంత్రులతో వెంకయ్య నాయుడి నివాసంలో కోలాహలం నెలకొంది. ఈ సందర్భంగా ఆయన నివాసం ఉన్న ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!












Click it and Unblock the Notifications