సౌదీ పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని.. హుటాహుటిన ఇండియాకు పయనం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని హఠాత్తుగా భారతదేశానికి తిరుగు పయనమయ్యారని సమాచారం అందుతుంది. వాస్తవానికి , మోదీ సౌదీ అరేబియాలో కీలకమైన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, ఊహించని విధంగా ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని, రాత్రికి రాత్రే భారతదేశానికి బయలుదేరారు. పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే.ఈ దాడిలో 27 మంది మరణించారు.ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు.

ఈ దాడిని అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. అమాయక పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఈ దాడి మానవత్వానికే మాయని మచ్చ అని ఆయన అన్నారు.అమాయక ప్రజల ప్రాణాలను బలిగొనే ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాద దాడి జరగడంతో ఆయన సౌదీ అరేబియా పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని స్వదేశానికి పయనమయ్యారని తెలుస్తోంది.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications