మోర్బి బ్రిడ్జీ ఇష్యూ: ప్రధాని మోడీ హై లెవల్ మీటింగ్, ఆదుకుంటామని భరోసా
గుజరాత్ మోర్బిలో జరిగిన కేబుల్ బ్రిడ్జీ ప్రమాదం విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ప్రధాని మోడీ సమవారం హై లెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జీ తెగి పడిపోయింది. అయితే ఆ సమయంలో బ్రిడ్జీ మీద ఎక్కువ మంది ఉన్నారట.. 500 మంది ఉండటమే కాక.. వారు ఊగడంతోనే ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన ఫుటేజీ బయటకు వచ్చింది. అయితే ప్రమాదంలో మాత్రం 134 మంది చనిపోయారు.
ఘటనపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై.. అన్ని కోణాల్లో చర్చ జరుపుతున్నామని తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటామని పేర్కొన్నారు. వారికి మెరుగైన చికిత్స ఇస్తామని వివరించారు. సమావేశానికి సీఎం భూపేంద్ర భాయ్ పటేల్, ఇతర గుజరాత్ మంత్రులు హాజయ్యారు.
నిజానికి ప్రమాద ఘటనను కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయలేదు. కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఖర్గే ఈ మేరకు కామెంట్స్ చేశారు. దీనిపై రాహుల్ గాంధీ కూడా అలానే స్పందించారు. కానీ ఓ నేత మాత్రం గుజరాత్ సీఎం రాజీనామా చేయాలని కోరా