పట్టాలపై నమో భారత్ - ఈ స్టేషన్ల మధ్య, అదిరిపోయే ఫీచర్స్..!!

దేశ వ్యాప్తంగా కొత్త రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో సెమీ స్పీడ్‌ రైళ్లు దూసుకెళుతున్నాయి. ఇప్పుడు రీజనల్‌ ర్యాపిడ్‌ ఎక్స్‌ రైళ్లు పట్టాలపై పరుగులు తీయబోతున్నాయి. రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ పేరుతో ప్రాంతీయ రైళ్లను కేంద్ర సర్కార్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి నమో భారత్‌ గా పేరు ఖరారు చేసారు. ప్రధాని మోదీ తొలి ర్యాపిడ్‌ఎక్స్‌ రైలును ప్రారంభించారు. ఈ రైలులో ఎన్నో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

ప్రారంభించిన ప్రధాని : ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్‌ స్టేషన్‌లో ఢిల్లీ-గాజియాబాద్‌-మేరఠ్‌ రీజినల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ కారిడాన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రారంభించారు. . ఈ కార్యక్రమంలో యూపి గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తదితరులు పాల్గన్నారు. రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడి అందులో ప్రయాణించారు.

PM Modi inaugurates Indias first regional rapid transit system, interact with students ans Crew of RapidX Train

స్కూల్‌ విద్యార్థులు, ర్యాపిడ్‌ఎక్స్‌ రైలు సిబ్బందితో ముచ్చటించారు. గంటకు 180 కి.మీ.గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా తీర్చిదిద్దిన ఈ హై స్పీడ్‌ రైలులో అధునాతన సదుపాయాలుంటాయి. ఢిల్లీ- గాజియాబాద్‌- మేరఠ్‌ మధ్య రూ.30,000 కోట్లతో చేపట్టిన రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ కారిడార్‌లో సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య ముందుగా 17 కి.మీ. దూరానికి ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

ఆధునిక సౌకర్యాలు : కొత్తగా ప్రారంభించిన ఈ రైలు ప్రయాణంలో మధ్య అయిదు స్టేషన్లు ఉంటాయి. నమోభారత్‌ రైళ్లలో అన్నీ ఏసీ బోగీలే ఉంటాయి. ప్రతి రైలులో 2 ప్లస్‌ 2 తరహాలో సీట్లు ఉంటాయి. నిలబడటానికి విశాలమైన ప్రదేశం, సామాన్లు ఉంచేందుకు అరలు, సీసీ టీవీ కెమెరాలు, అత్యవసర ఎగ్జిట్‌ మార్గాలు, లాప్‌టాప్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, రూట్‌మ్యాప్‌లు, దానంతట అదే నియంత్రించుకునే లైటింగ్‌ వ్యవస్థ ఉంటాయి.

ఈ హై స్పీడ్‌ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలందిస్తాయి. పావుగంటకు ఒకటి చొప్పున నడుస్తాయి. తర్వాత అవసరాన్ని బట్టి అయిదు నిమిషాలకొకటి నడుపుతారు. ప్రతి రైలులో ఆరు కోచ్‌లు ఉంటాయి. ప్రామాణిక కోచ్‌లలో 72, ప్రీమియం తరగతిలో 62 సీట్లు చొప్పున ఉంటాయి. నిల్చని ప్రయాణించేవారితో కలిపి ఏకకాలంలో 1,700 మంది వీటిలో వెళ్లవచ్చు.

టికెట ధరలు ఇలా : ప్రామాణిక కోచ్‌లలో టికెట్‌ ధర రూ.20-50 మధ్య, ప్రీమియం కోచ్‌లలో రూ.40-100 మధ్య ఉంటుంది. ప్రతి రైలులో ఒక కోచ్‌ను మహిళలకు కేటాయించారు. మహిళలు, దివ్యాంగులు, వయోవఅద్ధులకు ప్రతి కోచ్‌లోనూ కొన్నిసీట్లను కేటాయించారు.ప్రీమియం కోచ్‌లలో వెనుకకు వాలి కూర్చొనేలా సీట్ల అమరిక ఉంటుంది. కోటు, పుస్తకాలు వంటివి తగిలించుకునే ఏర్పాట్లు చేశారు. ఫుట్‌ రెస్ట్‌లు ఉంటాయి. ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సహాయపడేందుకు ఒకరు అందుబాటులో ఉంటారు. ఎనిమిది ఆర్‌ఆర్‌టీఎస్‌ కారిడార్లకుగానూ ముందుగా మూడింటిని ప్రాధాన్య ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+