ఇక చాలు, ఇంటికి వెళ్లు: మోడీపై నెటిజన్ల ఆగ్రహం
తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీ పైన సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళను సోమాలియాతో పోల్చుతూ ప్రధాని మోడీ మాట్లాడారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 'ఇక చాలు, ఇంటికి వెళ్లు' అని ఆగ్రహిస్తున్నారు.
కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ... దేవుని సొంత దేశం అని పేరున్న కేరళలో శాంతి భద్రతలు సోమాలియా కంటే దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ కార్యకర్తల హత్య, దళిత యువతిపై అత్యాచారం.. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వాం వైఫల్యాన్ని పక్కన పెడితే, కేరళను సోమాలియాతో పోల్చడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో మలయాళంలో విజయం సాధించిన ఓ సినిమాలోని డైలాగ్ 'పో మోనే దినేశా' కు పేరడీగా 'పో మోనే మోడీ' (ఇక చాలు, ఇంటికెళ్లు) అని విమర్శలు చేస్తున్నారు.
కేరళను సోమాలియాతో పోల్చడం దేశ ప్రధానిగా ఆయనకు సిగ్గుచేటు కాదా అని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలు సరికాదన్నారు.
-
"ఆ మంత్రికి మహిళలంటే పిచ్చి.. 5 వేల మందితో అఫైర్" -
"ప్రధాని మోదీ ఒక్క ఫోన్ కాల్.. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ముగింపు" -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications