ఆర్బీఐ అనుమతి లేకుండానే ప్రధాని మోడీ ఈ నిర్ణయం చేసేశారు: ఆర్టీఐ
ఢిల్లీ: 2016 నవంబర్ 8... ఈ తేదీ ప్రతి భారతీయుడికి గుర్తు ఉండే ఉంటుంది. ఆ రోజే రూ. 500 నోట్లు, నూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో యావత్ భారత దేశం రోడ్డుపై కొచ్చింది. ఎటు చూసినా ఏటీఎంల ముందు కిలోమీటర్ల మేరా క్యూలు దర్శనమిచ్చాయి. బ్యాంకుల ముందు కూడా పెద్ద ఎత్తున లైన్లు కనిపించాయి. తమ డబ్బును తాము తీసుకునేందుకు కూడా చాలా నియమనిబంధనలు అడ్డొచ్చాయి. ఇదిలా ఉంటే నోట్ల రద్దుకు సంబంధించి కొత్త విషయం ఒకటి బయటపడింది. ఆర్బీఐ అధికారికంగా అనుమతి ఇవ్వకుండానే పెద్ద నోట్లు రద్దు జరిగిందని ఆర్టీఐ ద్వారా బయటకు పొక్కింది.

నోట్లు రద్దు ప్రకటనకు రెండున్నర గంటల ముందు నాటి ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ప్రధాని మోడీని కలిశారు. ఆ సమయంలో ఊర్జిత్ పటేల్ మోడీతో ఎన్ని నిమిషాలు పాటు సమావేశం అయ్యారనే విషయాన్ని తెలుపుతూ ఐదు వారాల తర్వాత అంటే డిసెంబర్ 15,2016 సంతకం చేశారు. నవంబర్ 6వ తేదీ ఆర్బీఐ గవర్నర్ , డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. పెద్దనోట్ల రద్దును వారు స్వాగతించారు. అంతేకాదు స్వల్పకాలం పాటు కొంత ఇబ్బందులు ఉంటాయని అది జీడీపీ పై ప్రభావం చూపుతుందని కూడా చెప్పారు. అప్పటి ఆర్బీఐ బోర్డులో ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఒక డైరెక్టర్గా ఉన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనంకు చెక్ పెట్టొచ్చని చెప్పారు.
ఇక పెద్దనోట్ల ద్వారా అంటే రూ.500 నోట్లు, రూ.1000నోట్లు వినియోగించి బిల్లులు ఎంతమేరకు చెల్లించారో అనేదానిపై కూడా సమాచారం లేదని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు 2017-18 వార్షిక నివేదికను 29ఆగష్టు 2018లో విడుదల చేసింది ఆర్బీఐ. ఈ రిపోర్టులో రద్దయిన పెద్ద నోట్లు అన్నీ బ్యాంకులకు చేరుకున్నాయని చెప్పింది. రూ.15.31 లక్షల కోట్లు రూ. 500, రూ.1000 నోట్ల రూపంలో వచ్చాయని పేర్కొంది. అంటే నవంబర్ 8,2016 నాటికి వ్యవస్థలో 99.3శాతం లేదా రూ.15.417 లక్షల కోట్లు పెద్ద నోట్ల రూపంలో చలామణిలో ఉన్నాయి. అంటే ఆర్బీఐకి ఇంకా రూ. 10720 కోట్లు రావాల్సి ఉంది. నాడు ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఆర్బీఐ వ్యవహరించిందని... ప్రధాని తీసుకున్న తుగ్లక్ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications