చిన్నారులతో ఆడుకుంటూ ఢిల్లీ మోట్రో రైల్లో ప్రయాణించిన ప్రధాని మోడీ (వీడియో)
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రోలో తోటి ప్రయాణీకులతో కలిసి సీట్లో కూర్చున్నారు. పిల్లలతో కాసేపు ఆడుకున్నారు. ఆయన ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ మెట్రో స్టేషన్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గీతా ఆరాధన కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెట్రో రైలు ఎక్కారు.
నరేంద్ర మోడీ మెట్రో రైలులో ప్రయాణించడం చూసి ప్రయాణీకులు ఆశ్చర్యపోయారు. ఓ ప్రయాణీకుడు అతని పాదాలకు నమస్కరించారు. తొలుత మోడీ ఒక్కరే సీట్లో కూర్చున్నారు. కానీ ఇతర ప్రయాణీకులను పక్కన కూర్చోమనిమోడీ చెప్పారు. నమస్కారం పెట్టిన వారికి ప్రతి నమస్కారం పెట్టారు.
#WATCH: PM Narendra Modi took Delhi metro from Khan Market metro station earlier today. He was on his way to the Gita Aradhana event at ISKCON-Glory of India Cultural Centre. pic.twitter.com/aa8vkz6Iin
— ANI (@ANI) February 26, 2019
PM Narendra Modi took Delhi metro from Khan Market metro station earlier today. He was on his way to the Gita Aradhana event at ISKCON-Glory of India Cultural Centre. pic.twitter.com/SDUfpJMxhi
— ANI (@ANI) February 26, 2019
ఈ సందర్భంగా ఓ చిన్నారిని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని ఆడించారు. తన పక్కన కూర్చున్న ఓ తల్లి ఒడిలో కూర్చున్న చిన్నారి చెంపలు గిల్లి ఆడించారు. ఇతను ప్రజల ప్రధానమంత్రి అని పలువురు ప్రశంసిస్తున్నారు.
ఢిల్లీలోని ఇస్కాన్ ఆలయంలో గీతా ఆరాధన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అని చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రజలు విడిగా కాకుండా ఏకంగా ఉండాలని చెప్పారు.