భారత్- కెనడా మధ్య 2.6 బిలియన్ డాలర్ల యురేనియం డీల్..
భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ దిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య 2.6 బిలియన్ డాలర్ల యురేనియం సరఫరా ఒప్పందం కుదిరింది. అలాగే, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలను వేగవంతం చేయాలని ఇరు దేశాల నేతలు అంగీకరించారు. భారత పౌర అణుశక్తి కార్యక్రమానికి దీర్ఘకాలిక ఇంధన సరఫరాను నిర్ధారించే లక్ష్యంతో ఈ యురేనియం ఒప్పందాన్ని రూపొందించారు, ఇది భారత ఇంధన భద్రతకు అత్యంత కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.
సీఈపీఏ వాణిజ్య ఒప్పందాన్ని 2026 చివరి నాటికి పూర్తి చేయాలని ఉభయ పక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ప్రధాని కార్నీ తెలియజేశారు. ఇది ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చల అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, "సుదీర్ఘ కాల యురేనియం సరఫరాకు సంబంధించిన ఒక చారిత్రాత్మక ఒప్పందాన్ని మేము చేసుకున్నాం. చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, ఆధునిక రియాక్టర్లపై కూడా కలిసి పని చేస్తాం" అని స్పష్టం చేశారు.
రెండు దేశాలు కీలక ఖనిజాల సహకారం, పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహం, సాంస్కృతిక మార్పిడితో సహా పలు అవగాహన ఒప్పందాలపై (MoUs) సంతకాలు చేసుకున్నాయి. విదేశాంగ మంత్రులు ఎస్. జైశంకర్, కెనడా అనితా ఆనంద్ ఇరు ప్రధానుల సమక్షంలో ఈ పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం కోసం నిబంధనల విధివిధానాలపై భారత్, కెనడా అంగీకరించాయి. ఖనిజాల రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఉత్సాహాన్ని నింపినందుకు ప్రధాని కార్నీని మోదీ అభినందించారు. "భారత్, కెనడా ప్రజాస్వామ్య విలువలను దృఢంగా విశ్వసిస్తాయి. మేము వైవిధ్యాన్ని గౌరవిస్తాం. మానవజాతి శ్రేయస్సు మా ఉమ్మడి దార్శనికత. ఈ దార్శనికతను తరువాతి స్థాయి భాగస్వామ్యంగా మార్చేందుకు ఈరోజు చర్చించాం" అని మోదీ పేర్కొన్నారు.
ఆర్థిక సహకారంలో ఒక ఆశావహ లక్ష్యాన్ని నిర్దేశిస్తూ.. 2030 నాటికి $50 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని చేరుకోవాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని మోదీ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, "ఆర్థిక సహకారం యొక్క పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడం మా ప్రాధాన్యత. అందుకే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేయాలని నిర్ణయించాం. ఇది ఇరు దేశాల్లో కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది" అని వివరించారు. కార్నీ.. యురేనియం ఒప్పందాన్ని ఒక గొప్ప ముందడుగుగా అభివర్ణించారు. 2026 నాటికి CEPA చర్చలను ముగించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కెనడా ప్రధాని మరోసారి నొక్కిచెప్పారు.
ఇరు దేశాల అధినేతలు పునరుత్పాదక శక్తి, వాతావరణ కార్యక్రమాలలో సహకారాన్ని విస్తరించారు. అంతర్జాతీయ సౌర కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో చేరాలన్న కెనడా నిర్ణయాన్ని మోదీ స్వాగతించారు. ఈ ఏడాది ఇండియా-కెనడా పునరుత్పాదక శక్తి, స్టోరేజ్ సదస్సు జరుగుతుందని ఆయన ప్రకటించారు. సాంకేతికత, ఆవిష్కరణల విషయంలో ఇరు దేశాలు "సహజ భాగస్వాములు" అని మోడీ పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు (AI), క్వాంటం టెక్నాలజీలు, సూపర్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లలో సహకారం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజల-ప్రజల మధ్య సంబంధాలు, విద్యా భాగస్వామ్యాలు కూడా చర్చల్లో కీలక స్థానం పొందాయి. AI, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఆవిష్కరణలలో కొత్త విశ్వవిద్యాలయ సహకారాలను మోదీ ప్రకటించారు. కెనడియన్ విశ్వవిద్యాలయాలు భారత్ లో క్యాంపస్ లను తెరవడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.
స్థానిక, గిరిజన వర్గాల మధ్య పరస్పర సంబంధాలతో సహా సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడానికి కూడా ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇది ఇరు దేశాల ప్రజల మధ్య మరింత సన్నిహిత సంబంధాలను ప్రోత్సహిస్తుంది. మోదీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 27న భారతదేశానికి చేరుకున్న కార్నీ.. ఇది ఆయనకు మొదటి అధికారిక పర్యటన. ముంబైలో తన పర్యటనను ప్రారంభించిన ఆయన, ప్రతినిధి స్థాయి చర్చల కోసం దిల్లీ చేరుకున్నారు. తమ కార్యక్రమాలను ముగించుకుని సోమవారం సాయంత్రం బయలుదేరనున్నారు.

భారత-కెనడా వ్యూహాత్మక భాగస్వామ్యం కింద వాణిజ్యం, పెట్టుబడులు, కీలక ఖనిజాలు, వ్యవసాయం, విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు కీలక రంగాలలో సాధించిన ప్రగతిని ద్వైపాక్షిక చర్చలు సమీక్షించాయి. ఈ సందర్భంగా ఇరు అధినేతలు ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై కూడా అభిప్రాయాలను పంచుకున్నారు. అధికారిక చర్చలతో పాటు, మోడీ, కార్నీ ఇండియా-కెనడా CEO ల ఫోరమ్ కు హాజరయ్యారు. ఇది వ్యాపారం, పెట్టుబడుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే ప్రయత్నాలను నొక్కి చెప్పింది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications