పీఎన్బీ స్కాం: నేను ఇండియాకు రాను.., సీబీఐకి మెహుల్ చోక్సీ ఘాటైన లేఖ!
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణం ప్రధాన నిందితుల్లో ఒకరైన గీతాంజలి గ్రూప్ ప్రమోటర్ మెహుల్ చోక్సీ సీబీఐకి ఓ ఘాటైన లేఖ రాశాడు. 'నా పాస్పోర్ట్ను సస్పెండ్ చేశారు. నా పాస్పోర్టు రద్దుకు కారణమేంటో ముంబై రీజినల్ పాస్పోర్ట్ ఆఫీస్ వివరణ ఇవ్వలేదు. నాతో దేశానికి వచ్చిన ముప్పేంటో చెప్పలేదు..' అని ఆ లేఖలో పేర్కొన్నాడు.
Recommended Video

12,600 కోట్ల పీఎన్బీ కుంభకోణంలో వజ్రాల వ్యాపారి నీరవ్మోడీతోపాటు చోక్సీ కూడా నిందితుడిగా ఉన్నాడు. ఫిబ్రవరి 14న నీరవ్మోడీ, చోక్సీతోపాటు ఇతర కుటుంబ సభ్యులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ స్కాం బయటపడకముందే వీరంతా దేశం వదిలి పారిపోయారు.

తనకు వ్యతిరేకంగా మీడియా జరుపుతున్న విచారణ కారణంగానే పాస్పోర్ట్ రద్దు చేశారని కూడా సీబీఐకి రాసిన 7 పేజీల లేఖలో మెహుల్ చోక్సీ ఆరోపించాడు. భారత్ వస్తే తన కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందని, విచారణ కూడా పక్షపాతంగానే జరుగుతుందని పేర్కొన్నాడు. తనకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, తనను అరెస్ట్ చేస్తే సరైన వసతులు కూడా ఇవ్వరన్న ఆందోళన తనకు ఉన్నట్లు పేర్కొన్నాడు.
అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు ప్రయాణించే పరిస్థితుల్లో కూడా తాను లేనని, తనకు గుండె సంబంధిత చికిత్స జరుగుతోందని, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే అవకాశం కూడా ఇస్తారో లేదో తెలియదని, అందుకే తాను ఇండియాకు రాదలుచుకోలేదని మెహుల్ చోక్సీ పేర్కొన్నాడు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications