Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నుహ్ అల్లర్లు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అందర్, ఇంటర్నెట్ బంద్, 144 సెక్షన్, తోక తిప్పితే !

హరియానా/నుహా: ఇదే ఏడాది జూలై 31 నాటి హరియానాలోని నుహ్ హింసాత్మక కేసుకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. నుహ్ జిల్లాలో సెక్షన్ 144 సెక్షన్ అమలు చేసి నిషేధాజ్ఞలు విధించడమే కాకుండా రెండు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు.

మత ఘర్షణ తర్వాత ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా పేర్కొనబడిన ఫిరోజ్‌పూర్ జిర్కా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను గురువారం అర్థరాత్రి దాటిన తరువాత అరెస్టు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లోని ఇతర ఆరోపణల్లో మతం ఆధారంగా వివిధ వర్గాల మధ్య ద్వేషాన్ని ప్రోత్సహించడం కూడా ఉంది. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే నుహ్ అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ అరెస్టును పోలీసు అధికారులు ధృవీకరించారు.

Police arrested Congress party MLA in Nuh riots case in Haryana, Mobile internet ban

హరియానా అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ లీడర్ మాట్లాడుతూ ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు మాకు తెలియజేసారని అన్నారు. నుహ్‌లోని కోర్టు కాంప్లెక్స్ మరియు చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక్కడ ఖాన్‌ను రేపు పోలీసులు హాజరుపరిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

నుహ్ హింసాకాండ తర్వాత నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఖాన్‌ను నిందితుడిగా పేర్కొన్నట్లు హరియానా ప్రభుత్వం గురువారం హైకోర్టుకు తెలిపింది, ఆరోపణలకు మద్దతుగా పోలీసుల వద్ద ఫోన్ కాల్ రికార్డులు మరియు ఇతర ఆధారాలు ఉన్నాయని హరియానా ప్రభుత్వం పేర్కొంది. బుధవారం చండీగఢ్‌లో విలేకరుల సమావేశంలో మమ్మాన్‌ఖాన్ కేసును ఉద్దేశించి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడారు.

Police arrested Congress party MLA in Nuh riots case in Haryana, Mobile internet ban

కేసు దర్యాప్తులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ ప్రమేయం ఉందని తేలితే అతన్ని విడుదల చేయబోనని అన్నారు. హరియానా అదనపు అడ్వకేట్ జనరల్ దీపక్ సబర్వాల్ ఖాన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలను విశ్లేషించిన తర్వాత సెప్టెంబర్ 4న అతన్ని ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా పేర్కొన్నారని హైకోర్టుకు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నారు. జూలై 31న నూహ్‌లో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఊరేగింపుపై మరో వర్గం వాళ్లు గుంపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు మరణించగా, వారిలో ఎక్కువ మంది గాయపడ్డారు. నుహ్ పొరుగున ఉన్న గురుగ్రామ్‌లోని మసీదుపై జరిగిన దాడిలో ఒక మత గురువు మరణించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+