మద్రాస్ ఐఐటీలో ఉద్రిక్త పరిస్థితులు, లాఠీచార్జ్?
చెన్నై: మద్రాస్ ఐఐటీ క్యాంపస్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అందరు హడలిపోతున్నారు. విద్యార్థులు, పోలీసుల మద్య వాగ్వివాదం, తోపులాటలు జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ముందు జాగత్ర చర్యగా అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.
మంగళవారం ఉదయం మద్రాస్ ఐఐటి క్యాంపస్ లో సుమారు 100 మందికి పైగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో వారిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. తరువాత విద్యార్థులు పోలీసుల మీదకు తిరగబడ్డారు.
నిరసనలు తెలిపే హక్కు తమకుందని విద్యార్థులు నినాదాలు చేశారు. పోలీసులు విద్యార్థులను చితకబాదడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. క్యాంపస్ ఆవరణంలోకి వెళ్లడానికి మీడియాకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు పలు జాగ్రతలు తీసుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించారని ఫిర్యాదులు రావడంతో మద్రాస్ ఐఐటీలోని అంబేద్కర్ పెరియార్ స్టడీ సర్కిల్ (ఏపీఎస్ సీ) అనే విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై దేశంలోని పలు ఐఐటీ కాలేజ్ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
దేశంలోని ఐఐటీ కాలేజ్ లలోని విద్యార్థులు మంగళవారం ధర్నాలు నిర్వహించి ఫేస్ బుక్ లో ఫోటోలు అప్ లోడ్ చేశారు. అదే విదంగా తమిళనాడులోని పలు పార్టీల నాయకులు, స్వచ్చంద సంస్థలు, సంఘాలు మద్రాస్ ఐఐటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications