సర్వే దెబ్బ: కర్ణాటక ప్రభుత్వం పనితీరుపై 35 శాతం, నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని!
న్యూఢిల్లీ: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం పనితీరుపై కన్నడిగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వ పనితీరుపై 35 శాతం మంది తప్పుపడుతున్నారు. ప్రభుత్వం పనితీరు సవ్యంగా లేదని 35 శాతం మంది ప్రజలు ఆరోపిస్తున్నారని తాజా సర్వేలో వెలుగు చూసింది. ప్రధాన మంత్రిగా మళ్లీ నరేంద్ర మోడీ వస్తారని అధిక శాతం అభిప్రాయం వ్యక్తం చేశారు.
లోక్ సభ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగనున్న నేపధ్యంలో ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా కర్ణాటకలో సర్వే చేపట్టింది. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండి సర్వే చేపట్టి ఫలితాలు విడుదల చేసింది.

పని చెయ్యని ప్రభుత్వం
కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం పనితీరు బాగాలేదని 35 శాతం అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. 23 శాతం మంది కుమారస్వామి ప్రభుత్వం పనితీరు బాగుందని కితాబు ఇచ్చారు. 28 శాతం మంది కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం పనితీరు పర్వాలేదని అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే తెలిపింది.

ప్రజల అభిప్రాయం
కర్ణాటకలో మొత్తం 11,480 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి అధ్యయనం చేసి సర్వే విడుదల చేశారు. కర్ణాటక ప్రభుత్వ తీరుపై అత్యధిక శాతం మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్బంలో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పనితీరు పై కన్నడిగులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీVS రాహుల్ గాంధీ !
కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం తీరుపై కన్నడిగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని అంటున్నారు. ప్రధాని మంత్రిగా మళ్లీ నరేంద్ర మోడీ వస్తారని 55 శాతం మంది, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని 42 శాతం మంది కన్నడిగులు అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే వివరించింది.

తాగు నీరు సమస్య
కర్ణాటకలో జరిగిన సర్వేలో ఆ రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదట తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, దానిని పరిష్కరించాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండో సమస్య మరుగుదోడ్లు, మూడు సమస్య వ్యవసాయం అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. రూపాయి విలువ పడిపోవడం, పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోవడంతో నిత్యవసర వస్తువుల ధరలు అధికం అయ్యాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని సర్వే తెలిపింది.

బీజేపీకి చాన్స్
2018లో కర్ణాటకలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రజలు 104 స్థానాల్లో బీజేపీని గెలిపించి అగ్రస్థానంలో పెట్టారు. అయితే బీఎస్. యడ్యూరప్ప దూకుడు తనంతో మూడురోజుల్లో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీనిని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ (80), జేడీఎస్ (37) పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అయితే కర్ణాటకలో ప్రజలు ఇప్పటికీ బీజేపీ వైపు మొగ్గుచూపిస్తున్నారని తాజా సర్వేలో వెలుగు చూసింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications