Rajasthan Election: రాజస్థాన్లో జోరుగా పోలింగ్ : రిక్వెస్ట్ చేసిన మోదీ
జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు తెరచుకున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
రాజస్థాన్లో 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు 199 చోట్ల పోలింగ్ కొనసాగుతోంది. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడం వల్ల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. కరణ్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన గుర్మీత్ సింగ్ కూనర్.. కన్నుమూసిన విషయం తెలిసిందే.

మొత్తంగా 5,26,90,146 మంది రాజస్థానీయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. వారి కోసం 51,890 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,862 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్.. వంటి హేమాహేమీలు పోటీలో ఉన్నారు.
#WATCH | BJP leader Vasundhara Raje, who is contesting from the Jhalrapatan assembly constituency, offers prayers in a temple in Jhalawar pic.twitter.com/jVB5laDYp3
— ANI (@ANI) November 25, 2023
రాజ్యవర్ధన్ రాథోడ్, దియా కుమారి, కిరోడిలాల్ మినా ఏడుమంది ఎంపీలు.. ఎమ్మెల్యేలుగా రేసులో నిలిచారు. ఈ సారి వసుంధర రాజె ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ప్రకటించలేదు. ఫలితంగా ఆ పార్టీ మెజారిటీ స్థానాలను సాధించుకోగలిగితే కొత్త ముఖ్యమంత్రి వస్తారనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
#WATCH | Rajasthan Elections | A voter on a wheelchair being helped by her family to reach the polling booth, at a polling station in Sardarpura, Jodhpur. pic.twitter.com/V2f6Dp1J4u
— ANI (@ANI) November 25, 2023
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి సీనియర్లు పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా.. సుడిగాలి పర్యటనలు చేపట్టారు.
#WATCH | Rajasthan Elections | People queue up at a polling station in Jhotwara, Jaipur as voting gets underway for the state assembly elections. pic.twitter.com/054UWXB4CH
— ANI (@ANI) November 25, 2023
राजस्थान विधानसभा चुनाव के लिए आज वोट डाले जाएंगे। सभी मतदाताओं से मेरा निवेदन है कि वे अधिक से अधिक संख्या में अपने मताधिकार का प्रयोग कर वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट देने जा रहे राज्य के सभी युवा साथियों को मेरी ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 25, 2023
ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. గతంలో కంటే ఈ సారి పోలింగ్ శాతం పెరిగేలా చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండగ ఇదేనని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications