అవును, నేను బాబ్రీ కూల్చివేతలో పాల్గోన్నాను, అయితే ఏంటీ ప్రగ్యా ఠాకూర్ సింగ్
మధ్యప్రదేశ్, బోపాల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ప్రగ్యా ఠాకూర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బాబ్రీ మసీదు పై చేసిన వ్యాఖ్యలతో ఆమేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్థానిక ఎన్నికల అధికారి పోలీసులను ఆదేశించారు.

బాబ్రీమసీద్ వ్యాఖ్యలపై ప్రగ్యా పై కేసు నమోదు
ప్రగ్యా ఠాకూర్ ఓ టీవీ చానల్ లో ఇంటర్యూ ఇస్తూ బాబ్రీ మసీదు కూల్చివేతలో భాగస్వామిని అయినందుకు గర్విస్తున్నానని రెండు మతాల మద్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేసిందని అందుకే ఆమేపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో ఆమే మరో వివాదంలో చిక్కుకుంది.

బాబ్రా మసీదు కూల్చివేత పాల్గన్నందుకు గర్వంగా ఉంది.
గత వారం ఓ ఫ్రైవేట్ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమే మాట్లాడుతూ , బాబ్రీ మసీదు కూల్చివేత భాగస్వామి అయినందుకు గర్వంగా అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదు ను కూలగొట్టేందుకు తాము బా్బ్రీని కూల్చి వేసేందుకు వెళ్లానని , మసీదుకు ఓ బోల్టును ఊడగొట్టామని , కాగా కూల్చివేత సమయంలో తాను మసీదు పైకి ఎక్కి కూల్చి వేసినట్టు చెప్పింది.కాగా ఇది దేవుడు ఇచ్చిన అవకాశమని తెలిపింది. తాము ఖచ్చితంగా రామ మందిరాన్ని నిర్మిస్తామని అక్కడ నిర్మిస్తామని చెప్పింది.

నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా , ప్రగ్యా
కాగా రెండు వర్గాల మధ్య వివాదం రేపే వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు అందుకున్న ప్రగ్యా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కోంది. ఈనేపథ్యంలోనే తాను అక్కడికి ఖచ్చితంగా వెళ్లానని మసీదు కూల్చివేసేందుకు సహకరించానని చెప్పారు. ఆ వ్యాఖ్యల నుండి వెనక్కి తగ్గేది లేదని పేర్కోన్నారు, రామ మందిర నిర్మాణాన్ని ఎవరు ఆపలేరని ఈ సంధర్భంగా వ్యాఖ్యానించారు.

ఐపిఏస్ అధికారి హెమంత్ కర్కరే పై వివాదస్పద వ్యాఖ్యలు
ఇదివరకు ప్రగ్యా ఠాకూర్ మాలేగావ్ పేలుళ్ల కేసులో విచారణ అధికారిగా ఉన్న హెమంత్ కర్కరే పై ఆమే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తనను మాలేగావ్ కేసులో చిత్రహింసలకు గురిచేశారని, తాను శపిస్తేనే ఆయన అనంతరం మృత చెందారని వ్యాఖ్యానించింది.దీంతో ఈసీ దీనిపై నోటీసులు సైతం జారిచేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications