తనని గెలిపించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు మోడీ షాక్
ఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు మోడీ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఆయన నడుపుతున్న అసోసియేషన్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ అకౌంట్ బుల్ గవర్నెన్స్ (సీఏజీ)కు ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపించింది.
గత నాలుగేళ్లకు సంబంధించిన ఆదాయ వివరాలను ఇవ్వాలని అందులో పేర్కొంది. సీఏజీ అహ్మదాబాద్ చిరునామాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ ఈ నోటీసులను పంపించింది. సీఏజీ అధికారులు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
వార్షిక నివేదికలు, బిల్లులు, ఇన్ వాయిస్, ఇతర ఖర్చులకు సంబంధించిన వివరాలను, బ్యాంకు స్టేట్మెంట్లను సమర్పించాలని సూచించింది.
కాగా, 2014 సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోడీకి ప్రశాంత్ కిశోర్ ప్రచార వ్యూహకర్తగా పని చేశారు. ఆ తర్వాత బీహార్లో నితీష్ కుమార్ను మరోసారి అధికారంలోకి తీసుకు రావడానికి ఆయన ప్రధాన భూమిక పోషించారు. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు.